అన్నింటా కొత్తదనం కోసం వెంపర్లాడే యువత.. పెళ్లి తరువాత దిగాల్సిన ఫోటో షూట్ లోనూ నూతనత్వాన్ని ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. ఇదెక్కడి చోద్యం నాలుగు గోడల మధ్య చనువుగా వుండాల్సిన భార్యభర్తలు.. ఇలా బజారులో ఒకరిపై మరోకరు ప్రేమను కనబర్చడంతో పాటు వాటిని ఏఖంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నెట్టిజనులు తీవ్రంగా విమర్శించారు. మన సంప్రదాయబద్దంగా వివాహాలు చేసుకోవడంలోనూ ఇలాంటి నూతనత్వం రూపించలేదని ఇంకా నయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికోందరు మాత్రం వీరి వెర్రిచేష్టలు మిగతావారిని కూడా ప్రభావితం చేస్తాయని తూర్పారబట్టారు. ఇంకోందరు వారిని వెంటనే సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ దుర్భాషలాడారు.
దీంతో మొత్తానికి నోచ్చుకున్న కొత్తజంట.. తమ అభిప్రాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెగేసి చెబుతున్నారు. తమ రోమాంటిక్ ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. కేరళకు చెందిన రిషీ కార్తికేయన్, లక్ష్మి అనే యువతీ యువకులకు గత నెల (సెప్టెంబర్) 16న వివాహం జరిగింది. కరోనా నిబంధనల కారణంగా పెళ్లి వేడుకలు సాదాసీదాగానే జరిగాయి, అతిధులు కూడా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. దీంతో తమ పెళ్లిని విశేషంగా గుర్తుండిపోయేలా వుండాలని ప్లాన్ చేసుకున్న వధూవరులు.. తమ పెద్దల అనుమతితో ఎవరూ చేయని సాహసానికి దిగారు. ఓ ఫొటోగ్రాఫర్ ను తీసుకుని ఇడుక్కి తేయాకు తోటల్లోకి శృతిమించిన సరససల్లాప ఫోటోలను తీసుకున్నారు. అది కాస్తా వివాదాస్పదమైంది.
ఆ ఫోటోలు అసభ్యకరంగా వున్నాయని నెట్ జనులు తీవ్రంగా స్పందించారు. ఈ విమర్శలపై వధూవరులు స్పందిస్తూ.. సాధారణ సాంప్రదాయ వివాహ ఫోటోషూట్ల మాదిరిగా కాకుండా కొత్తగా ప్రయత్నించాలనే తాము ఇలా చేశామని ఈ జంట వెల్లడించింది. తమ ఫోటోలపై మిశ్రమ స్పందనలు ఊహించామని చెప్పిన జంట.. తమను పూర్తిగా తప్పుచేసిన వారిగా దోషులుగా నిందిస్తూ, విమర్శలు చేయడాన్ని అస్సలు ఊహించలేదని అన్నారు. నెట్ జనులు చేస్తున్న విమర్శలతో తాము ఏ మాత్రం వెనక్కు తగ్గబో్మని అన్నారు. ఇక తమ తల్లిదండ్రులపై కూడా విమర్శలు చేస్తూ వేధింపులకు గురిచేసినట్లు వదువు లక్ష్మి తెలిపింది.
తమ పెళ్లి తదనంతర ఫోటో షూట్ అంతటా తాము దుస్తులు ధరించే వున్నామని వారు చెప్పారు. వాగమోన్ లో తేయాకు తోటల్లో, బహిరంగ ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నప్పుడు దుస్తులు ధరించకుండా ఎలా వుంటామని వారు ప్రశ్నించారు, అలా ఫోటోలు రావడం ఫోటోగ్రాఫర్ అత్యంత గొప్ప పనితనానికి నిదర్శనమని చెప్పారు. ఆయన సృజనాత్మకత, కెమెరా నైపుణ్యంతోనే ఫోటోలు అందంగా వచ్చాయని అన్నారు, ఈ పోటోలపై చాలా మంది తనకు తెలియని వారు కూడా మోరల్ పోలీసింగ్ చేయడం తనకు ఇష్టం లేదని .. ఎవరు ఏమైనా అనుకున్నా తాను మాత్రం ఈ ఫోటోలను సామాజిక మాద్యమ దిగ్గజం ఫేస్ బుక్ అకౌంట్లో పోందుపర్చుతానని చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని తొలగించనని చెప్పారు.
తాను భుజాల కిందకు నుంచి డ్రెసింగ్ చేసుకుని.. మోకాళ్ల పైవరకు బట్టలు ధరించే వ్యక్తినని వధువు లక్ష్మీ అన్నారు. ‘‘నా మెడ లేదా కాళ్ళను చూపించడం నగ్నత్వానికి తలపించదని అన్నారు. అయితే తమ పెళ్లి ఫోటోలు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన తరువాత తాను తన డ్రెసింగ్ కన్నా అసభ్యకర కామెంట్లను చూశానని, తన తల్లిదండ్రులను కూడా వేధింపులకు గురిచేసేలా కామెంట్లు వున్నాయని.. ఇంతటి న్యూడిటీ మీ మాటల్లో, కామెంట్లలో పెట్టుకుని తమను నిందించడం ఎంతవరకు సమంజసమని వదువు ప్రశ్నించారు. ఇక కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కాబట్టి మేము దీనిని విస్మరించాలని నిర్ణయించుకున్నాము "అని లక్ష్మి అన్నారు. తమ కుటుంబానికి, బంధువులకు, ఇరుగుపోరుగు వారికి లేని అభ్యంతరాలు ఫేస్ బుక్ నుంచి వ్యక్తం కావడమేంటని అమె ప్రశ్నించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more