ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో ఐదవ రోజైన ఇవాళ అమ్మవారు సర్వసతీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. జ్ఞానప్రసాదిని అయిన సరస్వతీదేవీ అలంకరణలో కనకదుర్గమ్మను దర్శస్తే తమ పిల్లలకు విద్యాబుద్దులు ఒసగుతాయని భక్తులు తమ పిల్లలతో పాటుగా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు, అయితే దర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు మాత్రం టోకెన్ విధానంలో కేవలం 13 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమస్తున్నారు.
మూలా నక్షత్రయుక్తమైన ఇవాళ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సర్వసతీ దేవి అవతారంలోని దర్శనం ఇస్తారు. దీంతో సర్వసతీ మాతా అలంకరణలోని అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మూలా నక్షత్రం రోజున తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు కూడా అధికమంది ఉత్సాహం చూపినా.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అక్షరాభ్యాసం ఇత్యాధి కార్యక్రమాలను దుర్గగుడిలో అధికారులు నిర్వహించడం లేదు. ఈ కార్యక్రమాలను కూడా ఆలయం వెలుపల నిర్వహిస్తున్నారు. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి నిత్యకైంకర్యాలను నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.
నవరాత్రి ఉత్సవాల్లోని తొమ్మది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఇవాళ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పాన్ డమిక్ మార్గదర్శకాలను పాటిస్తున్న ఆలయ కమిటీ గంటలకు వెయ్యి మంది చోప్పున రోజుకు 13 నుంచి పదహారు వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా ఇవాళ అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇక పలువురు ప్రముఖులు కూడా ఇవాళ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయాన్నే రావడంతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం 13 వేల మంది భక్తులను మాత్రమే అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more