Durga Matha as Saraswati Devi at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై సర్వసతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Durga devi atop indrakeeladri attired as saraswati devi on fifth day of dasara celebrations

Kanaka durgadevi Temple, dasara celebrations, Saraswati Devi, Gayatri Devi, durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock, on the Fifth day of Navaratri celebrations today the Goddess Kanaka Durga attired as Saraswati Devi.

ఇంద్రకీలాద్రిపై సర్వసతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Posted: 10/21/2020 10:02 PM IST
Durga devi atop indrakeeladri attired as saraswati devi on fifth day of dasara celebrations

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో ఐదవ రోజైన ఇవాళ అమ్మవారు సర్వసతీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. జ్ఞానప్రసాదిని అయిన సరస్వతీదేవీ అలంకరణలో కనకదుర్గమ్మను దర్శస్తే తమ పిల్లలకు విద్యాబుద్దులు ఒసగుతాయని భక్తులు తమ పిల్లలతో పాటుగా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరారు, అయితే దర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు మాత్రం టోకెన్ విధానంలో కేవలం 13 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమస్తున్నారు.

మూలా నక్షత్రయుక్తమైన ఇవాళ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సర్వసతీ దేవి అవతారంలోని దర్శనం ఇస్తారు. దీంతో సర్వసతీ మాతా అలంకరణలోని అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మూలా నక్షత్రం రోజున తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు కూడా అధికమంది ఉత్సాహం చూపినా.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అక్షరాభ్యాసం ఇత్యాధి కార్యక్రమాలను దుర్గగుడిలో అధికారులు నిర్వహించడం లేదు. ఈ కార్యక్రమాలను కూడా ఆలయం వెలుపల నిర్వహిస్తున్నారు. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి నిత్యకైంకర్యాలను నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.

నవరాత్రి ఉత్సవాల్లోని తొమ్మది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఇవాళ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పాన్ డమిక్ మార్గదర్శకాలను పాటిస్తున్న ఆలయ కమిటీ గంటలకు వెయ్యి మంది చోప్పున రోజుకు 13 నుంచి పదహారు వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా ఇవాళ అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇక పలువురు ప్రముఖులు కూడా ఇవాళ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయాన్నే రావడంతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం 13 వేల మంది భక్తులను మాత్రమే అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles