తెలంగాణ పోలీసులు అందివచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులపై వేటను కోనసాగిస్తున్నారు. ఈ నెల 13న దాదాపు 300 మంది మావోయిస్టుల కదలికలు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. స్థానికంగా ఉన్న ఓ వాగును దాటుతుండగా కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకే భారీ స్థాయిలో మావో దళాలు అక్కడికి తరలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఛత్తీస్ గఢ్ పోలీసుశాఖ సమాచారం అందించిన పోలీసులు.. ఇటు తెలంగాణలో ఎక్కడా మావోయిస్టులు అలజడి రేగినా మొత్తంగా తూర్పారబడుతున్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా రెండు పర్యాయాలు మావోలతో ఎన్ కౌంటర్ జరిగినా.. వారు తప్పించుకుని పారిపోవడంతో అటవీప్రాంతం చుట్టూ పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా ఇవాళ కూడా రెండు పర్యాయాలు మావోలతో ఎదురుకాల్పలు జరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు బలగాలకు ఈ రోజు రెండు చోట్లా ఎదురు కాల్పులు జరిగాయి. కాగా ఈ రెండు ఘటనలలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలంలో ఒక పర్యాయం, ఇక సాయంత్రం ఏడు గంటల సమయంలో చర్ల మండలం చెన్నపురం వద్ద రెండో పర్యాయం మావోలతో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో పాటు మొత్తంగా ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసువర్గాలు పేర్కోన్నాయి, ఘటనా స్థలం నుంచి 8 ఎంఎం రైఫైల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాల్వంచ మండలంలో కాల్పులు జరిగాయని మావోలు పారిపోయారని పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కు సమీపంలోనే జరిగిందని పేర్కోన్నారు. ఈ ఘటనలో ఒక ఎస్బిబిఎల్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా సాయంత్రం ఏడు గంటలకు చర్ల మండలం చిన్నాపురం వద్ద మావోలు ఎదురుపడ్డారని, తమ బలగాలను చూసి తప్పించుకునే క్రమంలో ఎదురుకాల్పులకు పాల్పడ్డారని పోలీసులు బలగాలు పేర్కోన్నాయి, అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలపారు, కాగా, పలువురు మావోలు మాత్రం ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారని వారి కోసం గాలింపు కొనసాగుతొందని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more