(Image source from: Oneindia.com)
హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు ఉద్దృతి కొనసాగి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనాలు మాత్రం కరోనా విజృంభన మాత్రం ఆగిపోలేదని స్పష్టం చేస్తోంది. మహానగర వాసుల్లో కరోనా మహమ్మారి కాటు వేయడానికి సిద్దంగా వుందని వెల్లడించింది. లక్షణాలు లేని రోగుల ద్వారా కరోనా వ్యాప్తి మాటువేస్తోందని తెలిపింది. నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో తమ తాజా అధ్యయనంలో అనేక ఆందోళనకర విషయాలు వెల్లడించింది. కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే లేని వారికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేటతెల్లమైందని తెలిపింది.
లక్షణాలు వున్న రోగులతో పోల్చితే.. లక్షణాలు లేని రోగుల్లో కరోనా వైరస్ లోడు అధికంగా వుందని స్పష్టమైందని అధ్యయనాలు స్పష్టం చేసింది. మే, జూన్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా బారినపడిన 210 మంది రోగుల డేటాను సేకరించి విశ్లేషించిన అనంతరం ఈ విషయాలు వెల్లడించింది. మరీ అందోళనకర విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఏకంగా చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా రకం (20-బి) వుందని తేల్చింది. దీంతో పాటు 19-ఏ, 20-ఏ రకం నమూనాలు కూడా వున్నాయని తెలిపింది. అయితే నగరంలోని దాదాపు 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్టు తేలింది.
అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు అధికంగా ఉందని, దీంతో వారు కరోనా వైరస్ వ్యాప్తిని వేగంగా విస్తరించే ప్రమాదం కూడా వుందని, కరోనా వ్యాధి వ్యాప్తికి లక్షణాలు లేని రోగులు క్యారియర్స్ గా మారుతున్నారని అందోళన వ్యక్తం చేసింది. ఇక దీంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తుంటారని ఈ సర్వేలో తేలింది. వీరి నుంచి ఇమ్యూనిటీ స్థాయిలు తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు సర్వే గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే 70 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడ్డారని తేల్చింది, వీరి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పరోక్షంగా వారి మరణానికి కారణమవుతున్నట్టు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more