(Image source from: Hmtvlive.com)
దేశంలో కరోనా విజృంభన శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా కబళించివేస్తున్నా.. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన ప్రధాన మంత్రి ప్రజలకు కరోనాపై మాటలు చెబుతున్నారే తప్ప.. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సుమారు 80 వేల మంది దేశ ప్రజల ప్రాణాలను కరోనా కబళించి వేసినా.. వారికి కరోనాతో పాటు ఇతరాత్ర అరోగ్య సమస్యలు వున్నాయని అందుచేత వారు మరణించారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించడం దేనికి సంకేతమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీని చూస్తుంటూ నీరో చక్రవర్తిలా ఇప్పుడు దేశ ప్రజలకు కనిపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏకంగా 50లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడినా.. అందులో ఏకంగా 10 లక్షల యాక్టివ్ కేసులతో అసుపత్రులలో చికిత్స పోందుతున్నా.. ఏ మాత్రం పట్టని ప్రధాని ఓ వైపు నెమళ్లతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో దేశం అర్థికంగా పుంజుకునేందుకు ప్రజలపైనే భారం వేస్తూ ధరలను పెంచుతున్నారని తూర్పారబట్టారు, ఈ తరుణంలో దేశప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో వారి ప్రాణాలను వారే కరోనా నుంచి కాపాడుకోవాలని సూచించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ వారం గణనీయమైన సంఖ్యకు చేరుకుంటాయని, ఏకంగా కరోనా కేసులు 50 లక్షలకు చేరుకుంటాయని, యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరుకుంటాయని.. ఇక మరణాలు కూడా ఇప్పటికే 80వేలకు చేరకున్నాయని చెప్పారు. అంతులేని అహంకారం ఉన్న ఒక వ్యక్తి... ఆలోచన లేకుండా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయమే వైరస్ విస్తరించడానికి కారణమని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తన నివాసంలో నెమళ్లతో మోదీ గడిపిన వీడియోను షేర్ చేశారు. ఆలోచన లేకుండా విధించిన లాక్ డౌన్ తో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more