Covid 19: 7956 fresh cases reported in AP ఏపీలో 24 గంటల్లో 7956 కేసులు.. 60 మరణాలు

Coronavirus in ap new covid cases dip to 7956 tally rises to 5 75 lakh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 5,75,079 Mark after 7956 new cases were reported in the last 24 hours, out of which 4.67 lakh have so far recovered and have been discharged, while 4972 have died, the state health department said.

ఏపీలో కరోనా విజృంభన: 5 లక్షలు దాటి.. .. 24 గంటల్లో 7956 కేసులు.. 60 మరణాలు

Posted: 09/15/2020 12:22 AM IST
Coronavirus in ap new covid cases dip to 7956 tally rises to 5 75 lakh

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా ఐదు లక్షల డెబై ఐదు వేల మార్కును అధిగమించింది. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు పది వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. వరుసగా గత రెండు రోజులుగా కాస్తా నెమ్మదించింది. కాగా ఇవాళ మరింత తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఐదు లక్షల డెబై అయిదు వేల మార్కును అధిగమించి ఆరు లక్షల మార్కుకు చేరువలో వుంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

తమిళనాడు కోయంబేడు మార్కట్ లో విజృంభించిన కరోనా ఏపీపై కూడా తన ప్రభావాన్ని చాటింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 8 వేలమార్కుకు చేరువలో కేసులు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఐదు లక్షల డెబై అయిదు వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 7956 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 5,67,079 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా వేయికి పైగా కేసులు తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో రమారమి వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం రోజులుగా తగ్గుతున్న ఈ కేసులు మళ్లీ పెరగడంతో స్థానిక అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 483, చిత్తూరు జిల్లాలో 748, తూర్పు గోదావరి జిల్లాలో 1412, గుంటూరు జిల్లాలో 666, కడప జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 201, కర్నూలు 341 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి,

నెల్లూరు జిల్లాలో 756, ప్రకాశం జిల్లాలో 444, శ్రీకాకుళం జిల్లాలో 517, విశాఖపట్నం జిల్లాల్లో 490, విజయనగరంలో 481, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 1091 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 60 మంది అసువులు బాసారు. చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,

చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ 9,764 మంది అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఈ సంఖ్య  4,76,903కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 93,204 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles