రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకువస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ.. చివరాఖరకు వీఆర్వోల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేందుకు కూడా కారణమైన విషయం తెలిసిందే. అయితే ఇంతలా చట్టంలో మార్పులు తీసుకువస్తానన్నది మాత్రం ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన లంచగొండి వ్యవస్థ కోసమేనన్న విషయం మాత్రం జగమెరిగిన సత్యమే. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసించిన వారిపై రెవెన్యూ అధికారుల సంఘాలు విరుచుకుపడుతుంటాయి. మరో మాట మాట్టాడితే పరువు నష్టం దావాలకు సైతం సిద్దమని హెచ్చరికలు చేస్తాయి. కానీ అందరూ అయ్యవార్ల మధ్య మద్యంసీసా మాయమైందన్న రితీనే వుంటాయన్న ప్రజాభియోగాన్ని మాత్రం పట్టించుకోరు.
ఇక తాజాగా రెవెన్యూశాఖలో పెద్ద అవినీతి జలగను ఇవాళ ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ స్థాయిలోని వ్యక్తి ఏసీబి అధికారుల ఏకంగా రూ.40 లక్షల లంచం డబ్బుతో పట్టుబడ్డారు. ఈ ఘటన వెలుగుచూడటంతో ఈ వ్యవహారంలో స్థానిక అధికారుల ప్రయేయంపై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డిలో వున్న చిలిపిచేడ్ తహశీల్ధార్ ఎం డి సత్తర్ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి 8 గంటలు సోదాలు నిర్వహించారు. 114 ఎకరాల భూ పట్టాల మర్పడి కోసం ఎకరానికి లక్ష రూపాయల లంచాన్ని తీసుకున్న అదనపు కలెక్టర్ నాగేశ్ తో పాటు ప్రధాన సూత్రధారైన తహశీల్దార్ సత్తర్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట అసెంబ్లీలో అవినతి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన తరుణంలోనే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ చిలిపిచేడ్ తసీల్ధార్ ఎండి సత్తర్ లు ఏకకాలంలో అదే వ్యవస్థలో లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. బాధితుల పిర్యాదు మేరకు ఏకకాలం సిటీ రేంజ్ వన్ ఏసీబి అధికారులు పక్క సమాచారం తో రైడ్ చేశారు.ఇందులో మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ 40 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ కి దొరికారు. మిగితా డబ్బులు చెక్కుల రూపంలో దొరికాయి. ఈ వ్యవహారంలో ఎండి సత్తార్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చెపట్టారు. తహసీల్ధార్ ఇంట్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంటే 9 గంటలు సోదాలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more