Covid 19: 9652 fresh cases reported in AP ఏపీలో 24 గంటల్లో 9652 కేసులు.. 88 మరణాలు

Coronavirus in ap 9652 new covid 19 cases state tally pasts 3 06 lakh mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 3,06,261 Mark after 9652 new cases were reported in the last 24 hours, out of which 2,18,311 have so far recovered and have been discharged, while 2820 have died, the state health department said.

ఏపీలో కరోనా విజృంభన: మూడు లక్షలు దాటిన కరోనా కేసులు.. 2820 మరణాలు

Posted: 08/19/2020 02:56 AM IST
Coronavirus in ap 9652 new covid 19 cases state tally pasts 3 06 lakh mark

(Image source from: English.sakshi.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా మూడు లక్షల మార్కుకు చేరువలో వున్నాయి, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి, తొమ్మిది  వేల మార్కుకు పైగాకేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా మూడు లక్షల మార్కుకు అధిగమించాయి. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

ఇటీవల కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వేలకు చేరువలో కేసులు నమోదు కావడం స్వల్ప ఊరటనిస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 9652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 3,06,261 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పదమూడు వందల సంఖ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు పలు జిల్లాల్లో ఐదు వందలకు మించిన స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం ఈ జిల్లాల్లో అటుఇటుగా వెయ్యి మార్కును అందుకున్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం అధికార యంత్రాంగానికి స్వల్ప ఊరటనిస్తోంది, ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 445, చిత్తూరు జిల్లాలో 990, తూర్పు గోదావరి జిల్లాలో 1396, గుంటూరు జిల్లాలో 895, కడప జిల్లాలో 755, కృష్ణా జిల్లాలో 281, కర్నూలు 830 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.

నెల్లూరు జిల్లాలో 684, ప్రకాశం జిల్లాలో 725, శ్రీకాకుళం జిల్లాలో 405, విశాఖపట్నం జిల్లాల్లో 928, విజయనగరంలో 513, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 88 మంది అసువులు బాసారు. చిత్తూరు, ప్రకాశం,అనంతపురం, గుంటూరు, కర్నూలు నెల్లూరు జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,  

చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11, అనంతపురం జిల్లాల్లో 9 మంది, గుంటూరుజిల్లాల్లో 9 మంది, కర్నూలు జిల్లాల్లో 9 మంది, నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 6, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  2,18,311 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles