రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏ అంశమై అయోధ్య వార్తల్లో నిలిచింది.. సరిగ్గా అదే అంశమై వారం రోజుల తరువాత కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి ఏకంగా పెద్ద అలర్ట్ ఇచ్చింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ నెల 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్ అధ్యక్షత వహించిన విషయం కూడా తెలిసిందే. భూమి పూజ పర్యవేక్షణ పనులను చూసుకోవడంతో పాటు ఆయన ప్రధాని మోడీతో కలసి వేదికను కూడా పంచుకున్నారు. అయితే తాజాగా ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు.
రెండు రోజుల క్రితం జరిగిన కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్ దాస్ ప్రస్తుతంలో మథురలో ఉంటున్నారు. ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యులు కరోనాతో పాటు పలు పరీక్షలు చేశారు. దీంతో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్న మహమహులందరినీ వైద్య అరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం చేశారని సమాచారం. అయితే నృత్యగోపాల్ దాస్ మధుర వెళ్లిన నేపథ్యంలో అక్కడ కరోనా సోకిందా.? లేక ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు.
కాగా నృత్యగోపాల్ ధాస్ కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మథుర డీఎంతో మాట్లాడినట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు వేదికపై కనపడ్డారు. కాగా, భూమిపూజకు ముందు కూడా ఆలయ పూజారి ప్రదీప్ దాస్ తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి విదితమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more