విశాఖ వీధుల్లో మెట్రో రైలు పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ లకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ నిమగ్నమైంది. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ బిజీగా ఉంది. లైట్ మెట్రోకు సంబంధించిన డీపీఆర్ ని నవంబర్ నాటికి, ట్రామ్ కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ని డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి సమర్పించేందుకు యూఎంటీసీ సిద్దమవుతోంది. విశాఖ నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ కదులుతుందన్న అంచనాలతో.. మెట్రో కారిడార్ రూట్ మ్యాప్ రూపోందుతోంది. ఇక ఈ మార్గాలలో జరుగుతున్న అభివృద్ధి.. మరో పాతిక, ముఫ్సై ఏళ్ల తరువాత పరిస్థితులను, ట్రాఫిక్ ను అంచనా వేసుకుని డీపీఆర్ రూపొందిస్తున్నారు.
ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పనులు కూడా వేగాన్ని అందుకున్నాయి. కిలోమీటరు మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్ కారిడార్ కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్ మెట్రోరైలు, మోడ్రన్ ట్రామ్ కారిడార్ లకు సంబంధించిన డీటైల్డ్ ఫ్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ సిద్ధం చేస్తోంది. లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్ ను అప్ డేట్ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్ కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ ను రూ.3.38కోట్లకు అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది.
ఈ మేరకు రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన డీపీఆర్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ ల రూట్ మ్యాప్ లను సిద్దం చేయనుంది. 2020 చివరి నాటికల్లా లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి చేస్తాం. జూన్ 2021 నాటికి లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్ మెట్రోలో ఒక కారిడార్ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
లైట్ మెట్రో డీపీఆర్ పూర్తయ్యే సమయం – 2020 నవంబర్
కిలోమీటర్ నిర్మాణానికి లైట్ మెట్రోకు అయ్యే ఖర్చు – సుమారు రూ.200 కోట్లు
ట్రామ్ కారిడార్ డీపీఆర్ పూర్తయ్యే సమయం – 2020 డిసెంబర్
కిలోమీటర్ నిర్మాణానికి ట్రామ్ కారిడార్కు అయ్యే ఖర్చు – సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు
అగ్రిమెంట్ పూర్తి చేసుకునే సమయం – మార్చి 2021
లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభించే సమయం – జూన్ 2021
విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం – మార్చి 2024
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more