ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి మరోమారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం అందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల అదికారి నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని రాష్ట్రంలోని జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం వినతి మేరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది.
కాగా నిమ్మగడ్డ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని ప్రభుత్వం.. న్యాయస్థానం జారీ చేసిన కోర్టు ధిక్కార ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చులకన భావంగా పరిగణిస్తూ.. అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో తద్భిన్నంగా వ్యాఖ్యలు చేశారని కూడా సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వాలు చేసే పనేనా అంటూ సర్కార్ వెర్రి వేషాలను నిలదీశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘నిమ్మగడ్డ కేసు విషయానికి సంబంధించి తమకు ప్రతి విషయం తెలుసునని న్యాయస్థానం చెప్పింది. ఈ కేసులో తాము కావాలనే స్టే ఇవ్వట్లేదని పేర్కోంది. గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణంగా అభిప్రాయపడింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోరా.. గవర్నర్ తో కూడా చెప్పించుకోవాలా? అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని హరీశ్ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువు ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more