CBI questions Viveka's wife, daughter వైఎస్ వివేకా హత్యకేసు: భార్య, కూతురిని విచారించిన సీబిఐ.!

Cbi team reaches pulivendula to investigate y s vivekananda reddy murder case

CBI, Y S Vivekananda Reddy, Y S Viveka Murder case, YS Sunitha, YS Sowbhagyamma, YSRCP, TDP, YS Sunitha, Kadapa SP, K K Anburajan, Pulivendula, High court, Andhra Pradesh, Crime, Politics

The CBI investigation into the macabre murder of Y S Vivekananda Reddy, brother of late YS Rajasekhara Reddy and uncle of Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy, on Tuesday entered the fourth day.

వైఎస్ వివేకా హత్యకేసు: భార్య, కూతురిని విచారించిన సీబిఐ.!

Posted: 07/21/2020 07:08 PM IST
Cbi team reaches pulivendula to investigate y s vivekananda reddy murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఇవాళ ప్రారంభించింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్న ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విచారణ చేపట్టింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు .. వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు. 2019 మార్చి 15న పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సిట్‌ అధికారుల దర్యాప్తు నివేదికను పరిశీలించారు.

ఇప్పటికే సిట్‌ అధికారులు పలువురు రాజకీయ ప్రముఖులు, వైసీపీ, టీడీపీ నాయకులు, అనుమానితులను కలిపి మొత్తం 1300 మందిని విచారించారు. ఆ విచారణ నివేదికను సీబీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు రెండో రోజు కూడా ఇంటిని పరిశీలిస్తున్నారు. వివేకా హత్యకు గురైన పడక, స్నానపు గదులను పరిశీలించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ సర్వేయర్‌ ద్వారా ఇంటి కొలతలు వేయించారు. ఇంటికి ఎన్ని గదులు, కిటికీలు ఉన్నాయని క్షుణ్నంగా పరిశీలించారు.

ఆ తరువాత సీబిఐ అధికారుల బృందం నేరుగా పులివెందులలోని వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన భార్య సౌభాగ్యమ్మను కలసిన అధికారుల బృందం అమెను అడిగి పలు విషయాల్లో స్పష్టతను తెచ్చుకున్నట్లు సమాచారం. ఆదే సమయంలో ఇంట్లోనే వున్న వైఎస్ వివేక తనయ సునితను కూడా సీబిఐ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించారు. సీబిఐ అధికారుల బృందం సుమారు నాలుగు గంటల పాటు వైఎస్ వివేకా నివాసంలో సౌభాగ్యమ్మతో పాటు సునితను పలు విషయాలపై విచారించారు, అలాగే ఆ నివాసంలోనూ అధికారులు క్షణ్ణంగా మరిన్ని ఆధారాల కోసం పరిశీలించారు.

హత్యకు రాజకీయ కారణాలా?, భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాలను సిట్‌ తేల్చలేకపోయిందని చెబుతూ.. హత్య ఘటన ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహాలతో హైకోర్టు కేసును సీబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 16 మాసాల అనంతరం న్యాయస్థానం అదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ తమ పనిని వేగవంతం చేశారు. శనివారం రోజున కడప జిల్లా ఎస్సీ కార్యలయంలో ప్రారంభమైన విఛారణ.. ఇవాళ వివేక కుటుంబసభ్యుల విచారణతో ఓ అధ్యాయన్ని ముగించింది. ఇక ఈ కేసులు నిందితులను, అనుమానితులను అందరినీ విచారించిన తరువాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, ‘తుది నివేదిక’ను న్యాయస్థానానికి అందించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles