కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పలు దేశాలతో జరిపిన చర్చలు పలించడంతో ఆయా దేశాలు త్వరలోనే భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నెరపేందుకు అంగీకారం తెలిపాయని పేర్కోన్నాయి. తొలుత ఇందుకు సంబంధించి మూడు దేశాలతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఎయిర్ ఫ్రాన్స్, యూనైటెడ్ ఎయిర్ లైన్స్ తొలుత సర్వీసులను ప్రారంభిస్తాయని ఆ తరువాత జర్మనీ కూడా వచ్చి చేరుతుందని అన్నారు.
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు చెందిన పౌర విమానయాన అధికారులతో జరిపిన ఫలప్రదం అయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. అమెరికా రేపటి(శుక్రవారం) నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి(శనివారం) నుంచి భారత్ కు విమాన సర్వీసులు నడిపేందుకు ఆ దేశాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు యునైటెడ్ ఎయిర్లైన్స్ భారత్ - అమెరికా మధ్య 18 విమానాలను నడిపేందుకు ఒప్పందం జరిగిందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.
జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లుగా మంత్రి హర్ దీప్ సింగ్ స్పష్టం చేశారు. అయితే లాక్ డౌన్ విధించుకు కూర్చున రోజుల నుంచి మళ్లీ సాధారణ స్థితికి జనజీవనాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే విదేశీ విమానాయాన సర్వీసులను ప్రారంభిస్తున్నామన్నారు. దేశీయంగా మే 25 నుంచే విమానయాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. విదేశీయాన సర్వీసులు మాత్రం అనుమతించేందుకు పలు రాష్ట్రాలు, నగరాలు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కరాణంగా తెలిపారు.
ఇప్పటికీ పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పోడిగిస్తూ నిర్ణయాలు తీసుకోవడం, అదనపు ఆంక్షలను కోనసాగిస్తున్న నేపథ్యంలో కేవలం పలు ఎంపిక చేసిన భారత దేశనగరాలకు మాత్రమే విదేశీ విమనాయాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అన్నారు, అయితే ఓ వైపు కరోనా ఉద్దృతిని తట్టుకుని విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్న క్రమంలో ధరలు మాత్రం కాస్త అధికంగానే వుంటాయని తెలిపారు. అయితే గల్స్ దేశాల్లోని భారతీయులను వెనక్కి తీసుకువచ్చే క్రమంలో నడిపిస్తున్న వందే భారత్ విమానాల ధరలు మాత్రం కాసింత తక్కువగాను వున్నాయని ఆయన హర్దీప్ సింగ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more