Telangana to start for b.tech classes from August 17 ఆగస్టు 17 నుంచి ఇంజనీరీంగ్ తరగతులు షురూ..

Engineering classes commence from august 17 in telangana

Telangana colleges, Telangana universities, degree and pg exams, coronavirus, degree and pg exams news, degree and pg exams latest, degree and pg exams new updates, degree and pg exams dates, degree and pg exams schedules, degree exams, post Graduate exams, final semister, coronavirus, covid-19

The Telangana Higher Education department to conduct Degree, PG, MBA, MCA, BPharma examinations following the guidelines issued by the Union government. The Government is ready to start Engineering classes from August 17th.

వాళ్లంతా పాస్.. ఆగస్టు 17 నుంచి ఇంజనీరీంగ్ తరగతులు షురూ..

Posted: 07/17/2020 04:19 PM IST
Engineering classes commence from august 17 in telangana

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరమితమైన విద్యార్థులను మరో నెల రోజుల తరువాత కాళాశాలలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందరు విద్యార్థులను కాకుండా కేవలం ఇంజనీరింగ్, డిగ్రీ సహా ప్రోఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సరిగ్గా నెల రోజుల తరువాత తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్నయించింది. కాగా, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వినతుుల వెల్లువెత్తగా.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన అదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలన్ని నిర్ణయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీషార్మసీ, ఎంబిఏ, ఎంసీఏ తదితర ప్రోఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులను ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం చివరి విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ చదివే విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ లో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.  విద్యా వ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ 2020, జులై 16వ తేదీ గురువారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సాగిన ఈ సమావేశాలలో విద్యావ్యవస్థ  పూర్తి స్థాయిలో ప్రక్షాళన, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతపై దీర్ఘకాలిక వ్యూహాలను రూపోందించే అంశాలపై చర్చించింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇందుకోసం  విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. విద్యావ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని తెలిపారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles