కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరమితమైన విద్యార్థులను మరో నెల రోజుల తరువాత కాళాశాలలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందరు విద్యార్థులను కాకుండా కేవలం ఇంజనీరింగ్, డిగ్రీ సహా ప్రోఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సరిగ్గా నెల రోజుల తరువాత తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్నయించింది. కాగా, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వినతుుల వెల్లువెత్తగా.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన అదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలన్ని నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీషార్మసీ, ఎంబిఏ, ఎంసీఏ తదితర ప్రోఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులను ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం చివరి విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ చదివే విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ లో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ 2020, జులై 16వ తేదీ గురువారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సాగిన ఈ సమావేశాలలో విద్యావ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతపై దీర్ఘకాలిక వ్యూహాలను రూపోందించే అంశాలపై చర్చించింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. విద్యావ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని తెలిపారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more