(Image source from: Twitter.com/ANI)
విశాఖపట్నంలోని పరవాడ ఫార్మసీటి పరిథిలోని రాంకీ ఎస్ఈటీపీ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీపేలుళ్ల ఘటనలో సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి చెందారు. పేలుళ్ల కారణంగా నిన్న రాత్రి భారీగా మంటలు ఎగసిపడగా.. విధులకు హాజరైన సీనియర్ కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాసరావు పరిశ్రమ నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు కంపెనీ వద్దనున్న పోలీసులకు పిర్యాదు చేశారు. పరిశ్రమ వద్ద ప్రమాదం ఘటన సమాచారాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆరా తీసారు. అయితే ఆయన ఆచూకీ లభ్యం కాలేదని రాత్రి అధికారులు తెలిపారు.
కాగా ఇవాళ ఉదయం పరిశ్రమ శిధిలాలను తొలగిస్తున్న క్రమంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి.. తీవ్రంగా రుధిర గాయాలైన స్థితిలో వుండి. అయితే శ్రీనివాస రావు మరణాన్ని ఇంకా కంపెనీ యాజమాన్యం కానీ, పోలీసులు కానీ ధృవీకరించలేదు. దీంతో సాల్వెంట్ పరిశ్రమ వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి, ఇక ఇదే సంస్థలో పనిచేస్తున్న మరో కార్మికుడు మల్లేష్ గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగానే వుంది. మరో ముగ్గురు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో ముగ్గురే కార్మికులు వున్నారని చెప్పిన యాజమాన్యం.. సంస్థలో ఐదుగురిపైగా సిబ్బంది వున్నారని తెలిపింది.
సంస్థలో రెండో షిప్టులో ఏకంగా పదిహేను మంది సిబ్బంది పనిచేస్తుంటారని కార్మిక వర్గాల సమాచారం, అయితే నిన్నటి రోజున ఎంత మంది కార్మికులు విధులకు హాజరయ్యారన్న విషయమై యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా సంస్థలో సంభవించిన పేలుడు ఘటనలో ఏకంగా 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి, యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more