దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల నూతన విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. కొత్తగా సాంకేతిక విద్యాలో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్ ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
అయితే ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సులలో కొనసాగుతున్న పాత విద్యార్థులు తరగతుల నిర్వహణను కూడా సవరించింది. వీరికి ఆగస్టు 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను తాజాగా ఆగస్టు 16 నుంచి ప్రారంభించాలని తాజాగా తమ సవరించిన విద్యా క్యాలెండర్ లో పేర్కోంది. అయితే పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లమా కోర్సులను అభ్యసిస్తున్న పాత విద్యార్థులకు మాత్రం ఈ నెల 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని తాజాగా పేర్కోంది. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో దీని గడువు జూన్ 30గా ఉంది. అలాగే, ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేసి మిగిలిన సీట్లను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో పీజిడిఎం, పీజీసీఎం పాత విద్యార్థులకు ఈ నెల 15 నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అందోళన వ్యక్తం అవుతోంది. ఇక దీనికి తోడు ఆగస్టు 16 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబిఏ, ఎంసీఏ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు తరగతులను ప్రారంభించడంపై కూడా అందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more