(Image source from: Hmtvlive.com)
ధేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. దేశ్యవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుమతులు లభించింది. ఇక రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోకూడదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కోంది. అయితే ఈ అదేశాలను ప్రామాణికంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణాలు సాగించాలని భావిస్తే మాత్రం అది చెల్లబాటు కాదని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై రాకపోకలకు ఎలాంటి అనుమతుుల అవసరం లేదని కేంద్రం అదేశాలిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇవి అమలు కావని అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తప్పనిసరని తాజాగా ఏపీ హోంశాఖ అధికారులు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చే వారిని అనుమతించే విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రభావం అధికంగా వున్న రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కోనసాగుతాయిన స్పష్టం చేశారు. అటు తెలంగాణ నుంచి వచ్చేవారిపై కూడా ఈ అంక్షల ప్రభావం వుంటుందని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను యధాతథంగా కొనసాగించేటట్లు డీజీపీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోకి రావాలంటే తప్పనిసరిగా అనుమతి పోందాల్సిన అవసరం వుందని ( కోవిడ్ పర్మిట్ పాస్) తీసుకోవాలని, పాస్ ఉన్నవారిని ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. రాత్రిపూట అనుమతి లేదని, రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్(అనుమతి) పొందాలని సూచించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. నిన్న ఉదయం నుంచి పాసులు లేకుండా ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు వెనక్కి పంపించారు. రాత్రి 7గంటలు దాటిన తర్వాత పాసులు ఉన్న వారిని అనుమతించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more