Coronavirus: India reports record 18,522 cases in a day దేశంలో ఐదున్నర లక్షలు దాటిన కరోనా కేసులు..

Coronavirus cases in india tally tops 5 6 lakh nearly 17000 dead

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

With a record 18522 coronavirus cases reported in the past 24 hours, the total count in India has risen to 5,66,860. The death toll has gone up to 16,893 as Covid-19 claimed 418 lives in 24 hours. According to Health Ministry figures released today morning, 3,34,821 have recovered so far while there are 2,15,125 active cases in the country.

భారత్ లో కరోనా విజృంభన: 17 వేలు దాటిన మరణాలు.. 24 గంటల్లో 418

Posted: 06/30/2020 11:33 AM IST
Coronavirus cases in india tally tops 5 6 lakh nearly 17000 dead

(Image source from: Prokerala.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత రెండురోజుల నుంచి కొద్దిగా తక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 19 వేల మార్కుకు పైబడిన కేసులు తాజాగా 18 వేలకు పైగా నమోదయ్యాయి. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ ఏకంగా ఐదు లక్షల అరవై వేల మార్కును దాటేసింది. అదే సమయంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తనవ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. ఇక పదిహేడు వేల మార్కుకు చేరువ మరణాలతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన ఏడవ దేశంగా నమోదైంది.

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన జూన్ 7 నుంచి రోజుకు ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ 19 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇరవై రోజుల్లో దేశంలో ఏకంగా పది వేల సంఖ్యకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి, ఇది దేశంలోనే అత్యధికం. దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏకంగా ఆరు లక్షల మార్కును అందుకునేందుకు కరోనా కేసులు ఉద్దృతి పెంచుతున్న క్రమంలో భారత్ ప్రభుత్వం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు మూడు వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 418 మరణాలు నమోదయ్యాయి,

దేశంలో అన్ లాక్ 2.0 కూడా జులై 1 నుంచి అమల్లోకి రానుండడంతో రాకపోకలకు అనుమతులు లేకుండా చేసింది. దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 18,522 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 5,66,840 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలలోనూ తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 418 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పదిహేడు వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్య ఏకంగా 16,893కు చేరింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 3,34,821 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 2,15,125 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 58.6 శాతంగా నమోదైంది.

మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉద్దృతి భారీగా పేరుగుతోంది. దేశంలో నమోదైన మొత్తం ఐదున్నర లక్షల కరోనా కేసులలో సమారు రెండున్నర లక్షల కేసులు ఈ రెండు ప్రాంతాల నుంచే అంటే విస్మయం చెందక తప్పదు. ఇక దేశంలోని మరణాలలోనూ ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికం. మహారాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం చేస్తుండంతో అక్కడి సామాన్య ప్రజల జీవినం స్థంభించింది. మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా మహమ్మారి తన పంజాను విసురుతూ వేలాది మందిపై ప్రభావాన్ని చూపుతోంది. మ‌హారాష్ట్రలో మొత్తం 1,69,883 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 7610 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజ‌ధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 85,161కి చేర‌గా 2680మంది చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles