భారత్-చైనాల మధ్య భారత ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గ్వాలన్ వ్యాలీలో ఏకంగా 20 మంది భారత అర్మీకి చెందిన సైనికులతో పాటు కల్నల్ సంతోష్ బాబును ఇనుప చువ్వలతో దాడి చేసి వారి మరణానికి కారణమైన నాటి నుంచి చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత దేశ ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో చైనాలో తయారైన వస్తువులను కూడా నిషేధిస్తున్నారు. చైనా బజార్లలో లభించే హర్ ఏక్ మాల్ ప్లాస్టిక్ వస్తువుల నుంచి భారత్ దేశ ప్రభుత్వ సంస్థల కాంట్రాక్టుల వరకు అన్నింటా చైనాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం కూడా చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్టాక్ సహా 59 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్టాక్, ఎంఐ వీడియో కాల్ సహా మొత్తం 59 యాప్లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్లు ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయని చైనాకు భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసింది.
అయితే వాటిపై చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో చైనా యాప్ లపై నిషేధం విధించింది. ఇటీవల భారత్ -చైనా సరిహద్దులో గల్వాన్ వ్యాలీ వద్ద నెలకొన్న భీకర ఘర్షణ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్రం ఓవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూనే.. మరోవైపు, చైనా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్లో అనేక రకాలుగా చలామణిఅవుతున్న యాప్లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని పసిగట్టిన భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more