జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. భారత సైనిక దళాలతో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు చేస్తున్న ఉగ్రవాద నివారణ ఫలితాలు ఇస్తోంది. భారత్ దేశంలో చిచ్చుపెట్టేందుకు.. అల్లకలోల్లం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేమిత ఉగ్రవాద సంస్థలు నిత్యం పాకులాడుతున్నాయి. అయితే వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కోంటూ మట్టుబెట్టుతున్నాయి భారత బలగాలు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ తో పాటు మరో ఇద్దరు మరణించారు,
దీంతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకాశ్మీర్ లోని ఓ జిల్లాలో పూర్తిగా పట్టుకోల్పోయింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో అనంత్ నాగ్ జిల్లా ఖుల్ చోహార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఆనంత్ నాగ్ పోలీసులు, రాష్ట్రీయ రైఫీల్స్, సీఆర్పీఎఫ్, జరిపిన ఎన్ కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా టెరరిస్టులతో పాటు జిల్లా కమాండర్ కూడా మరణించాడని తెలిపారు. జిల్లా హిజ్ బుల్ కమాండ్ ను మసూద్ అని, మరో ఇద్దరిలో ఒకరు అనంత్ నాగ్ జిల్లాలోని లాల్ చౌక్ ప్రాంతానికి చెందిన తరీఖ్ ఖాన్ అని, మరోకరు ఖుల్గామ్ ప్రాంతానికి చెందిన నదీమ్ గా పోలీసులు గుర్తించాయి, ఇక మసూద్ తో పాటు వీరిని భారత బలగాలు మట్టుబెట్టాయని, దీంతో ఇక దోడా జిల్లా ఉగ్రవాద రహితంగా మారిపోయిందని తెలిపారు.
ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అనంత్ నాగ్ జిల్లా ఖుల్ చొహార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సాయుధ బలగాల సాయంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు. సంఘటనా స్థలంలో ఓ ఏకే-47తో పాటు రెండు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఏ ఉగ్రసంస్థకు చెందినవారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీంతో ఈ ఏఢాదిలో ఇప్పటి వరకు ఏకంగా 116 మంది ఉగ్రవాదులతో పాటు ఏడుగురు కమాండర్లను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఈ నెలలో భారత బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ల సంఖ్య ఇవాళ్టి దానితో కలిపి 13వది. ఈ మొత్తం 13 ఎన్ కౌంటర్లలో మొత్తం 40 మంది ఉగ్రవాదలు హతమయ్యారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులే భారత బలగాల ప్రధాన టార్గెట్ గా ఎంచుకుంది. ఈ ఏడాదిలోనూ హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక నేత రియాజ్ నైకో కూడా భారత బలగాల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more