(Image source from: Abc7news.com)
ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా విస్తరించి.. అన్ని దేశాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటోంది మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏకంగా కోటి మందికిపైగా తన ప్రభావానికి గురిచేసింది. ఇక ఏకంగా ఐదు లక్షల మంది ప్రాణాలను కబళించివేసింది. ఇటు దేశంలోనూ రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కేసుల మాదిరిగానే అటు ప్రపంచ వ్యాప్తంగానూ రోజురోజుకూ కేసులు సంఖ పెరుగుతూ అందోళనకర పరిస్థితులను ఉత్పన్నం చేస్తోంది. ఆదివారం రోజున 24 గంటల వ్యవధిలో దాదాపు 190,000 కొత్త కేసులను నమోదు కాగా, తాజాగా ఇవాళ ఏకంగా రెండు లక్షల కేసులు నమోదు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది.
ఇక మరణాల సంఖ్య కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా ఐదు లక్షల మార్కు దాటింది. కరోనా వైరస్ ప్రభావం బారిన పడి అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రపంచదేశాలన్నీ అందోళన చెందుతున్నాయి. జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నివేదిక ప్రకారం, అమెరికా నుండి వచ్చిన కేసులు 189,077 కొత్త అంటువ్యాధులలో 62%, ఆగ్నేయాసియా నుండి 13% మరియు యూరోప్ దేశాల నుండి 8.8శాతంగా ఉన్నాయి. అమెరికా మరియు బ్రెజిల్ దేశాలలో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా వుంది. ఈ రెండు దేశాల మధ్య నమోదైన కేసుల సంఖ్య సుమారుగా యాభై శాతం నమోదయ్యాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా కోటి మందికి పైగా కేసులును చూపించింది,
ఇక తాజాగా నమోదైన కేసులతో సోమవారం నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణంకాల ప్రకారం ఏకంగా కోటి మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం మరియు బ్లూమ్బెర్గ్ న్యూస్ సేకరించిన సమాచారం ప్రకారం, అమెరికాలో కరోనా వైరస్ కేసులు గతం కంటే మరింత అత్యధికంగా విజృంభిస్తున్నాయి. టోక్యోలో తాజాగా మరో ఆరవై కేసులు నమోదయ్యాయి. టోక్యలో గత నెలలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఇక సింగపూర్ తమ దేశంలోని పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసింది. జూలై 1 నుంచి తమ దేశంలో కాసినోలను తెరిచేందుకు అదేశాలను కూడా జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలువురు అమెరికన్లు ట్రంప్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందని అక్షేపించారు.
* గ్లోబల్ ట్రాకర్: కేసులు 10 మిలియన్లు దాటాయి; మరణాలు టాప్ 500,000
* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ -19 కేసులు కోటిమంది బాధితులు
* భారతదేశ నగరాల నుంచి కోట్లాది మంది వలస కార్మికులు స్వస్థలాకు వెళ్లిపోయారు
* అమెరికా ఐదు దశల్లో కోవిడ్ -19 మహమ్మారిని మారుస్తోంది
* రెండవ తరం టీకాలు తయారీపై కరోనావేగం ప్రభావం చూపుతున్నాయి
.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more