covid 19: 553 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 553 కేసులు.. ఏడు మరణాలు

Coronavirus in ap 553 new covid 19 cases state tally nears 11 thousands mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh nears 11 thousand Mark after 553 new cases were reported in the last 24 hours, out of which 4989 have so far recovered and have been discharged, while 136 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 553 కేసులు.. ఏడు మరణాలు

Posted: 06/25/2020 02:43 PM IST
Coronavirus in ap 553 new covid 19 cases state tally nears 11 thousands mark

(Image source from: Telanganatoday.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పది వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా వారం రోజులుగా నాలుగు వందల సంఖ్యలో కరోనా కేసులు రాష్ట్రంలో నిర్థారణ అవుతున్నాయి, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ రెండు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదువందలకు పైగా కేసులు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా పదకొడు వేల మార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 553 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పదకొండు వేల మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 10884 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చినవారు 69 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 76గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 553 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవాళ నమోదైన కేసుల్లో అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పగోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప, విశాఖపట్నం, పశ్చివ గోదావరి జిల్లాల్లో అత్యదిక కేసులు నమోదయ్యాయి, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో స్పల్పంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 10884 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మరణాలు కూడా క్రమంగా ప్రతీ రోజు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఏడుగురు అసువులు బాసారు.

తాజాగా కర్నూలులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనాబారిన పడి మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 136కి చేరింది. కాగా 118 మంది కరోనా పేషంట్లు కోలుకోవడంతో వారిని ఇవాళ అసుప్రతి అధికారులు డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4989కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 5760కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 371గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 1730కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles