దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. విదేశాల్లో దీని ప్రభావాన పడి దేశాలకు చెందిన కీలక నేతలు క్వారంటైన్, ఐసోలేషన్ లకు తరలివెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇటు దేశంలోనూ ఇప్పటికే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని సైతం కబళించిందిన. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే ను కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కూడా కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. పశ్చిమబెంగాల్ అధికార ప్రభుత్వం ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు హ్యాట్రిక్ విజయంతో కొనసాగుతున్న ఆయన అధికారు తృణముల్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన మే నెలలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ (60) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. కరోనాతో పాటు ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుటంతో కరోనా తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తమ పార్టీకి తీరని లోటని పేర్కోన్నారు.
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంతాపం తెలిపారు. తమోనష్ ఘోష్ ఆకస్మిక మరణం.. అందులోనూ కరోనా వైరస్ తో మరణించడం తమను కలచివేసిందని అన్నారు. ఆయన ఇవాళ తమను వదిలేసి వెళ్లడం బాధగా వుందన్నారు. ఆయన తమ పార్టీలో ఏకంగా మూడున్నర దశాబ్దాలుగా కొనసాగారని, తన ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన నిత్యం తన ప్రజల సంక్షేమం, అభివృద్ది గురించి తప్పించారని మమత అన్నారు. తమోనష్ ఘోష్ తన సామాజిక సేవతో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. తమోనష్ ఘోష్ సతీమణి ఝర్నాతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు ఆమె తన తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more