ఐదు శతాబ్దాల క్రితం నాటి చారిత్రాత్మకమైన దేవాలయం ఒడిశాలోని మహానదిలో బయటపడింది. శతాబ్దాల క్రితం భక్తుల తాకిడిని చవిచూసిన పురాతన దేవాలయం.. 1933లో వచ్చిన వరదల్లో మునిగిపోయిన పుణ్యక్షేత్రం ఇన్నాళ్లకు మళ్లీ బయటపడింది. 90 ఏళ్ల క్రితం భారీ వరదల వల్ల మహానది తన దిశను మార్చుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో నయాఘర్ సమీపంలో ఉన్న ఆలయంతో పాటు మొత్తం గ్రామం మునిగిపోయింది. ఆలయానికి సంబంధించి పైభాగం కొంచెం బయటపడడంతో... గుడిని గుర్తించినట్టు 'ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్టీఏసీహెచ్)' కు చెందిన పురావస్తు సర్వే బృందం తెలిపింది.
'ఈ దేవాలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. 450 నుంచి 500 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహాన్ని మరో ఆలయానికి తరలించారు. మహానది లోయ ప్రాంతంపై మేము ప్రాజెక్ట్, డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ ఆలయం గురించి వెతికాం. ఆలయం పైభాగం కనిపిస్తోందంటూ వారం క్రితం మాకు సమాచారం వచ్చింది' అని ఐఎన్టీఏసీహెచ్ చీఫ్ అనిల్ కుమార్ ధీర్ తెలిపారు. ఈ ఆలయంలోని మూలవిరాటు విష్ణు అవతారమైన శ్రీకృష్ణ భగవానుడిదై ఉంటుందని అనిల్ కుమార్ చెప్పారు. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం దేవాలయం మునిగినప్పటికీ.. ఇప్పటికీ మంచి కండిషన్ లోనే ఉందని తెలిపారు.
ఈ ఆలయాన్ని మరోచోట ఏర్పాటు చేస్తామని... ఆ టెక్నాలజీ తమ వద్ద ఉందని చెప్పారు. మునిగిపోయిన ఆలయాన్ని తాము గుర్తించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 65 దేవాలయాలు నీట మునిగాయని... వీటిలో ఈ దేవాలయం అత్యంత ఎత్తైనదని చెప్పారు. మరోవైపు స్థానికులు మాట్లాడుతూ, నీటి మట్టం కంటే ఎత్తులో 11 ఏళ్ల క్రితం తొలిసారి దేవాలయం పైభాగం కనిపించిందని చెప్పారు. అప్పటి నుంచి రీసర్చర్లు దాన్ని ట్రాక్ చేస్తున్నారని తెలిపారు. పురాతన ఆలయం బయటపడటంతో... దాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారు. దీంతో, లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కొంత సందడి నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more