తెలంగాణలో కరోనా మహమ్మారి తన ఉదృతిని పెంచుకుంటోంది. హైదరాబాద్ మహానగరంపై పంజావిసురుతూ.. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టికృషితో తగ్గిన కరోనాకేసులు.. మళ్లీ అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మార్చి తొలివారంలో తొలి కరోనా కేసు నమోదైంది. సికింద్రబాద్ మహేంద్రాహిల్స్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్.. విదేశాలకు వెళ్లి కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. కాగా మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభించాయి.
అప్పటి నుంచి విడతల వారీగా వస్తున్న సడలింపులతో కరోనా వ్యాప్తి పెరగిందే తప్ప ఆగింది లేదు. ఇక గత పక్షం రోజులుగా నమోదవుతున్న కేసులు తెలంగాణ వాసుల్లో అందోళనను రెకెత్తిస్తోంది. ప్రతిరోజు వందకు పైగా కేసులు నమోదవుతుండగా, గత వారం రోజులుగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయికి చేరింది. ఇక ఇదే సమయంలో అటు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ కరో్నా వైరస్ కు హాట్ హాబ్ గా మారింది. కరోనా కట్టడి చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలూ వినబడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అవి జిల్లాల్లో అమలు జరుగుతున్నంత పటిష్టంగా రాజధాని నగరంలో అమలు జరగడం లేదన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.
నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా.. ఇక ఇప్పుడు పూర్తిగా నగరాన్ని చుట్టేసింది. దీంతో దీనిని ఎలా కట్టడి చేయాలో అన్న విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది, అంతర్జాతీయ నగరంగా ప్రసిద్దికెక్కిన హైదరాబాద్ మహానగరంలో కరోనా కట్టడి కావడం లేదన్న వార్తలు ప్రభుత్వానికే శరాఘాతంగా మారాయి, అంతేకాదు ఈ విమర్శలు అటు అధికారుల, ఇటు హెల్త్ వర్కర్లు, వైద్యులకు సవాల్ విసరుతున్నాయి. ఇదే సమయంలో కరోనా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కూడా అధికారులకు కంటిమీద కనుకు కరవయ్యేలా చేస్తున్నాయి, దీనికి తోడు మరణాలకు కూడా అధికంగానే నమోదు కావడంలో అందోళన కలిగిస్తోన్న అంశం.
తాజాగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తంగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేసులు 189గా వున్నాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదు వేల మార్కును దాటింది. ఇక తాజాగా నమోదైన కేసులన్నీ రాష్ట్రానికి చెందిన వారివే కావడం.. ఇందులో ఎలాంటి వలస వచ్చిన కార్మికులు కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు కానీ లేకపోవడం గమనార్హం. ఇక గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులు తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా నమోదైన కేసలలో 218 కేసులలో 189 కేసులు జీహెచ్ఎంసీకి చెందినవే కాగా, మిగిలిన 29 కరోనా కేసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5193కి చేరింది.
అటు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా పెరుగతోంది. మరణాలు కూడా రోజువారీగా నమోదవ్వడం మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ కూడా ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 187కు చేరింది. తాజాగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 189 మందికి కరోనా సోకగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. వరంగల్ అర్భన్ జిల్లాలో నలుగురికి, మేడ్చల్ జిల్లాలో ఇద్దరికి, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆ తరువాత వరంగల్ రూరల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది.
మహబూబ్ నగర్, మెదక్, అదిలాబాద్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. నగరంలో అన్ లాక్ తో అనేక సడలింపులు రావడంతో.. ఉరుకులు, పరుగుల నగరవాసి జనజీవనంతో ఎక్కడ ఏముందో తెలుసుకునే లోపు కరోనా కాటువేస్తోంది. దీంతో గ్రేటర్ పరిధిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2766 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,240 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 4498 మంది రాష్ట్రవాసులు కాగా, మరో 459 మంది వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more