Covid 19: 304 fresh cases reported in AP ఏపీలో 6500 మార్కును దాటిన కేసులు.. 86 మరణాలు

Coronavirus in andhra pradesh 304 new covid 19 cases state tally reaches 6456

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 6456 after 304 new cases were reported in the last 24 hours, out of which 2770 have so far recovered and have been discharged, while 86 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 6500 మార్కుకు చేరువలో కేసులు.. 86 మరణాలు

Posted: 06/15/2020 02:48 PM IST
Coronavirus in andhra pradesh 304 new covid 19 cases state tally reaches 6456

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఆరున్నర వేల మార్కును ఐదు వేల మార్కును దాటాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత కొన్ని రోజులుగా వందకు పైగా నమోదువుతున్న కేసుల సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో మూడువందలకు పైగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా 300 వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరున్నర వేలమార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 304 కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 6456కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు వున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు రాష్ట్రానికి వలస వచ్చిన కూలీల్లో కొందరితో పాటు మొత్తంగా 58 మందికి కరోనా వున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇక 246 మంది రాష్ట్రవాసులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయ్యిందని రాష్ట్ర వైద్యఆరోగ్య గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని చెప్పారు.గడిచిన 24 గంటల వ్యవధిలో 304 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 6500 మార్కు చేరువకు రాష్ట్రంలో కరోనా కేసులు పరుగులు తీస్తున్నాయి, మొత్తంగా 6456 మందికి కరోనా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఇద్దరు అసువులు బాసారు. వీరిలో ఒకరు కర్నూలు జిల్లాకు, మరోకరు అనంతపురం జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 86కి చేరింది.

కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2770కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 2231గా నమోదు అయ్యింది. అయితే కొవిడ్ బారినపడి చికిత్స పోందుతున్న వారిలో వున్న విదేశీయుల సంక్య 210గా నమోదు కాగా, ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల సంఖ్య కూడా ఏపీలో గణనీయంగానే వుంది. ఏకంగా 1159 మంది వలస కూలీలు కోవిడ్ బారిన పడి చికిత్సపోంతున్నారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles