(Image source from: english.sakshi.com)
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ఉదృతిని పెంచుతోది. శరవేగంగా వ్యాప్తి చెందుతూ.. అనేక మందిని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై పంజా విసురుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సికింద్రబాద్ మహేంద్రాహిల్స్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ కరోనా తొలి పేషంట్ గా నమోదైన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. కాగా మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక గత పక్షం రోజులుగా నమోదవుతున్న కేసులు తెలంగాణ వాసుల్లో అందోళనను రెకెత్తిస్తోంది.
ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు తెలంగాణలో నమోదైన గరిష్ట కేసుల సంఖ్యగా 253గా తేలడం మరో అందోళకన విషయం. ఏకంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విలయతాండం చేస్తుండగా, అటు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ కరో్నా వైరస్ కు హాట్ హాబ్ గా మారింది. కరోనా కట్టడి చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారన్ని విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అవి జిల్లాల్లో అమలు జరుగుతున్న విదంగా నగరంలో అమలు జరగడం లేదన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.
నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా.. ఇక ఇప్పుడు పూర్తిగా నగరాన్ని చుట్టేసింది. దీంతో దీనిని ఎలా కట్టడి చేయాలో అన్న విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది, అంతర్జాతీయ నగరంగా ప్రసిద్దికెక్కిన హైదరాబాద్ మహానగరంలో కరోనాను కట్టడి చేయడం లేదన్న విమర్శలు కూడా అటు అధికారుల, ఇటు హెల్త్ వర్కర్లు, వైద్యులకు సవాల్ విసరుతున్నాయి. ఇదే సమయంలో కరోనా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కూడా అధికారులకు కంటిమీద కనుకు కరవయ్యేలా చేస్తున్నాయి, దీనికి తోడు మరణాలకు కూడా అధికంగానే నమోదు కావడంలో అందోళన కలిగిస్తోన్న అంశం.
తాజాగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తంగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో సింహభాగం కేసులు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినవే. కాగా, తాజాగా నమోదైన 253 కేసులన్నీ రాష్ట్రానికి చెందిన వారివే కావడం.. ఇందులో ఎలాంటి వలస వచ్చిన కార్మికులు కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు కానీ లేకపోవడం గమనార్హం. ఇక గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులు తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ కు చెందినవే. తాజాగా నమోదైన కేసలలో 253 కేసులలో 179 కేసులు జీహెచ్ఎంసీకి చెందినవే కాగా, మిగిలిన 74 కరోనా కేసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 4737కి చేరింది.
అటు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా పెరుగతోంది. ఇవాళ ఏకంగా 8మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 182కు చేరింది. తాజాగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 179 మందికి కరోనా సోకగా, సంగారెడ్డి జిల్లాలోనూ ఏకంగా 24 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆ తరువాత మేడ్చల్ జిల్లాలో 14 కేసులు, రంగారెడ్డిలో 11, మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు, వరంగల్ అర్భన్. వరంగల్ అర్భన్, ములుగు, నల్గోండ, సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో రెండు చోప్పునా కరో్నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నగర్ కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. నగరంలో అన్ లాక్ తో అనేక సడలింపులు రావడంతో.. ఉరుకులు, పరుగుల నగరవాసి జనజీవనంతో ఎక్కడ ఏముందో తెలుసుకునే లోపు కరోనా కాటువేస్తోంది. దీంతో గ్రేటర్ పరిధిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2352 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,203 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 4288 మంది రాష్ట్రవాసులు కాగా, మరో 449 మంది వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more