Covid 19: 222 fresh cases reported in AP ఏపీలో 5800 మార్కును దాటిన కేసులు.. 82 మరణాలు

Coronavirus in andhra pradesh 222 new covid 19 cases state tally reaches 5858

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 5858 after 222 new cases were reported in the last 24 hours, out of which 2641 have so far recovered and have been discharged, while 82 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 5800 మార్కును దాటిన కేసులు.. 82 మరణాలు

Posted: 06/13/2020 05:33 PM IST
Coronavirus in andhra pradesh 222 new covid 19 cases state tally reaches 5858

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు వేల మార్కును దాటాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత కొన్ని రోజులుగా వందకు పైగా నమోదువుతున్న కేసుల సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో రెండువందలకు చేరువలో కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా 200 వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 వేల 9 వందల మార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 222 కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 5858కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు వున్నాయి. విదేశఆల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు రాష్ట్రానికి వలస వచ్చిన కూలీల్లో మరో 33 మందికి మొత్తంగా 36 మందికి కరోనా వున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇక 186 మంది రాష్ట్రవాసులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయ్యిందని రాష్ట్ర వైద్యఆరోగ్య గణంకాలు స్పష్టం చేస్తున్నాయి, రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,477 మంది సాంపిళ్లను పరీక్షించగా వారిలో 222 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 5858 మందికి కరోనా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఇద్దరు అసువులు బాసారు. వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 82కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2641కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 1865గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles