దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో దేశంలో అమల్లోకి వచ్చిన తొలి అన్ లాక్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ఐదు వేల నుంచి ఎనమిది వేలకు ఎగబాకింది. ఆ తరువాత గత వారం రోజులుగా ప్రతీరోజు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇవాళ దానిని కూడా అధిగమించిన స్థాయిలో పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో నమోదైన కేసులతో భారత్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ప్రభావిత దేశంగా నిలించింది. ఈ క్రమంలో రెండు లక్షల 96 వేల కేసులతో నాల్గవ స్థానంలో వున్న యైనైటెడ్ కింగ్ డమ్ ను భారత్ అధిగమించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన వివరాల మేరకు దేశంలో మునుపెన్నడూ నమోదుకాని సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 10,965 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97 వేలు రమారమి మూడు లక్షల మార్కుకు చేరింది. గత వారం రోజులుగా ప్రతీరోజు పది వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 2,97 వేల 535 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8498కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 396 మరణాలు సంభవించాయి.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీలలో కరోనా ప్రభావం తీవ్రంగా వుంది. ఇక్కడ నుంచే రమారమి తాజా కేసులన్నీ నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. అటు మరణాలలోనూ మహారాష్ట్ర అధికంగా నమోదుచేసుకుంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మహరాష్ట్రలో 152 మరణాలు నమోదు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మరణాలు మహారాష్ట్రలో నమోదు కాలేదు. దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 147,195 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 141,842 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య.. చికిత్స పోందుతున్న రోగుల సంఖ్య కన్నా పెరగడం కాస్త ఊరటనిస్తోంది.
కాగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. గత పన్నెండు రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. సరిగ్గా మే 18న లక్ష కేసులను నమోదైన దేశంలో కేవలం 24 రోజుల వ్యవధిలోనే మరో రెండు లక్షల కేసులను నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 24వేల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 3607 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏకంగా 152 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 97,648 కేసులు నమోదు కాగా, మొత్తంగా మూడున్నర వేల మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more