దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్.. భారత్ లో తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూపోతోంది. రోజురోజుకు ప్రజల మనుగడనను ప్రశ్నార్థకంగా మారుస్తూ తన ప్రభావనికి గురిచేస్తున్న వైరస్.. ఇక తన వ్యాప్తిని కూడా పెంచుకుంటోంది. దేశంలో జనవరి 30వ తేదీన తొలి కేసు నమోదైన తరువాత 111 రోజులకు లక్ష కేసులు నమోదు చేసుకుంది. ఆ తరువాత తన వేగాన్ని పెంచుకుంటోన్న మహమ్మారి ఆ తరువాత కేవలం పక్షం రోజుల వ్యవధిలో దేశంలో మరో లక్ష మందిని తన ప్రభానికి గురిచేసింది.
దీంతో దేశంలో క్రమంగా కరోనావైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య రెండు లక్షల మార్కుకు చేరువలో వుంది. అటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు కూడా అందోళన కలిగించే స్థాయికి చేరువవుతున్నాయి. ఐదో విడద లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో మూడవ విడత లాక్ డౌన్ ముగింపు వేళ.. రోజువారిగా నాలుగు వేల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చే నాటికి రోజుకు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఎనమిది వేలకు పైబడి కాంటాక్టు కేసులు నమోదు అవుతున్నాయి.
దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఎనమిది వేలకు చేరువలో కేసులు నమోదు కావడం.. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవ్వడం కలవరం రేపుతోంది. ఇక ఈ మురణాల్లోనూ యాభై శాతానికి పైగా మహారాష్ట్రలోనే సంభవించడం ఆ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 8171 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,98,706 కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 204 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 5600 మార్కుకు చేరులోకి చేరుకుంది. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5598కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 2, 2020
(As on 02 June, 2020, 08:00 AM)
▶️ Confirmed cases: 198,706
▶️ Active cases: 97,581
▶️ Cured/Discharged/Migrated: 95,527
▶️ Deaths: 5,598#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHI
Via @MoHFW_INDIA pic.twitter.com/Iaz24gXAFT
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more