దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యం కానుందని చేసిన అంచనాలను తోసిరాజుతూ సరిగ్గా సమయంలోనే రుతుపవనాలు వచ్చేశాయి. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.. ఈ ఏడాది కూడా అదే క్రమంలో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరాయి. ఇక ఇక్కడి నుంచి వారం రోజల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. ఆ తరువాత దేశం మొత్తం విస్తరించే రుతుపవనాలు.. దేశంలోని రైతన్నకు మేలు చేసేలా.. ప్రజల దాహార్తిని తీర్చేలా విస్తారమైన వర్షాలను కురిపిస్తాయి.
గడచిన ఐదేళ్లలో ఐఎండీ అంచనా వేసినట్టే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2015లో మాత్రం ఐఎండీ అంచనా తప్పింది. ఈ ఏడాది మే 30న రుతుపవనాలు తాకుతాయని అంచనా వేయగా.. వారం రోజుల ఆలస్యంగా జూన్ 5న తాకాయి. 2016లో జూన్ 7కి వస్తాయని చెబితే.. జూన్ 8న, 2017లో ఐఎండీ అంచనా వేసినట్టు మే 30న, 2018లో మే 29న దేశంలోకి రుతుపవనాలు వచ్చాయి. గతేడాది మాత్రం ఐఎండీ అంచనా కంటే రెండు రోజులు ఆలస్యంగా జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి. కాగా ఈ సారి జూన్ 5న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేయగా జూన్ 1వ తేదీనే తాకాయి.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో ఇక దేశవ్యాప్తంగా విస్తారించిన తరువాత ఇక వానలు కురవనున్నాయి. కాగా, ఈ పర్యాయం సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ వర్షాకాలంలో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇధిలావుండగా, అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్-దమణ్ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు. దీంతో తీరప్రాంతంలో జాతీయ విపత్తు అధికారులతో పాటు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంత వాసులను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more