దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్.. భారత్ లో తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూపోతోంది. దేశంలో వరుసగా అత్యధిక కేసులు నమోదు కావడం అందోళన వ్యక్తం చేస్తోంది. ఎనమిది వేల పాజిటివ్ కేసులు ఇవాళ ఏకంగా ఎనమిది వేల నాలుగ వందల చేురువలో కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధిక స్థాయిలో నమోదైన మరణాలు కూడా అందోళన వ్యక్తం చేస్తోంది.
దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఎనమిది వేలకు చేరువలో కేసులు నమోదు కావడం.. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవ్వడం కలవరం రేపుతోంది. ఇక ఈ మురణాల్లోనూ యాభై శాతానికి పైగా మహారాష్ట్రలోనే సంభవించడం ఆ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 8392 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,90,535 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 17 వేలకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవించడం.. గడిచిన 24 గంటల్లో 290 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 5934కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. శనివారం నమోదైన 265 మరణాల తరువాత ఇదే రెండో అత్యధికం కావడం గమనార్హం. మహారాష్ట్రలో కరోనా విజృంభన కోనసాగడంతో పాటు ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.
ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 91,819 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 93,322 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 42శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి తీవ్రంగా వుంది. ఫలితంగా రోజురోజుకు పెరుగుతున్న కేసులతో దేశంలో మొత్తంగా నమోదైన కేసులు కరోనా వైరస్ బారిన దేశాల జాబితాలో భారత్ ను ఏకంగా ఏడవ ప్రభావిత దేశంగా నిలిపింది. ఈ వరుసలో ఇటీవలే టర్కీని దాటిన భారత్.. కరోనా ప్రభావిత దేశాల జాబితాలోని మరో రెండు దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలను కూడ దాటేసింది. లక్షా 88 వేల కేసులతో ఫ్రాన్స్ 8వ స్థానంలో వుండగా, దానిని కూడా భారత్ అధిగమించింది. ఇక భారత్ ముందు ఇటలీ 2 లక్షల 32 వేల కేసులతో 6వ ప్రభావిత దేశంగా వుంది. అయితే మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more