మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు చక్కని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వారు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు జట్టు కురుస్తోంది. ఇంతకీ వారు ఎవర్ని కాపాడారు.? ఎలా కాపాడారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? గొండియా జిల్లాలోని సాలెకాసా అటవీ ప్రాంత రేంజ్ లో సంచరిస్తున్న రెండు ఎలుగుబంట్లు బావిలో పడ్డాయి. బావిలో పడి నీళ్లలో కొట్టుకుంటున్నాయి. మనుషులను అనుకరించే ఈ ఎలుగుబంట్లు అచ్చంగా మనుషుల తరహాలోనే బావిలోంచి బయటకు వచ్చాయి.
అదెలా అంటే.. బావిలో పడ్డ రెండు ఎలుగు బంట్లు నీటిలోనే కొట్టుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు గోండియాలో సాలెకాసా రేంజ్ కు చెందిన అటవీశాఖ అధికారులకు తెలిపారు. వాటిని కాపాడేందుకు ఇద్దరు రేంజర్లు రంగంలోకి దిగారు, నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు కూడా వారి శ్రమను కరతాళధ్వులతో స్వాగతించారు. అయితే ఇక్కడ వారు ఏకంగా రెండు గంటల పాటు శ్రమించిన తరువాత వారి ప్రయత్నాలను నిచ్చెనే గట్టెక్కించింది.
ఎలుగుబంట్లను బయటకు తీసేందుకు వారికి కనిపించిన ఒకే మార్గం నిచ్చెన. అంతే స్థానిక గ్రామస్థుల నుంచి ఓ నిచ్చెనను ప్రయత్నంలో భాగంగా బావిలోకి నిచ్చెన వేశారు. దీంతో ఆ ఎలుగుబంట్లు నిచ్చెనను పట్టుకుని మనుషుల్లా ఎక్కుతూ బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంట్లు బయటపడిన తీరును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Amidst the two gloomy news of Corona & Amphan we are navigating here, this cheered my heart. Officials and staff from Salekasa Range, Gondia, Maharashtra rescued two bears that had fallen in wells.
— Susanta Nanda IFS (@susantananda3) May 20, 2020
All gratitude to these frontline green warriorspic.twitter.com/MSasvjFYUj
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more