దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కేంద్రం ప్రకటించిన నాలుగో విడత లాక్ డౌన్ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. ఆర్థిక కార్యకలపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా పలు కార్యాలయాలు తెరుచుకొనేందుకు అనుమతిచ్చింది. నూటికి నూరుశాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు కూడా కేంద్రం అనుమతులను మంజూరు చేసింది. ఇక వర్క్ ప్రం హోం అవకాశం ఇవ్వదలచిన కార్యాలయాలు వాటిని కోనసాగించవచ్చునని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక పూర్తిస్థాయిలో ప్రభుత్వ/ ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఒకటి లేదా రెండు కేసులు వస్తే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయా కార్యాలయాలను శానిటైజేషన్ చేయాలని సూచించింది. ఒకవేళ భారీ సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం మొత్తం భవనాన్ని 48గంటల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఆ కార్యాలయ భవనాలను శానిటైజ్ చేసి ఇక సిబ్బందిని అనుమతించవచ్చు అని చెప్పేవరకు అందరూ ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనబడితే వాళ్లు ఆఫీస్కు వెళ్లకుండా వైద్యుల్ని సంప్రదించేలా చూడాలంది. ఒకవేళ కరోనాగా అనుమానం ఉన్నా.. నిర్ధారణ అయినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం తెలపాలని సూచించింది.
కంటైన్మెంట్ జోన్లలో హోం క్వారంటైన్లో ఉన్న సిబ్బంది అడిగితే వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. సమావేశాల నిర్వహణ, సందర్శకులను సమన్వయం చేయడం వంటి విషయాల్లో సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మార్గదర్శకాలను చాలా జాగ్రత్తగా పాటించాలని సూచించింది. కార్యాలయాల్లో కారిడార్లు, ఎలివేటర్లు, మెట్లు, క్యాంటీన్, సమావేశ గదులు, కాన్ఫరెన్స్ హాళ్లలో దగ్గరగా మెలిగే అవకాశం ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా అనుమానిత కేసు ఉంటే సమర్థంగా స్పందించాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more