ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన నెమ్మదించింది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుందన్న సమయంలోనే మళ్లీ వేగాన్ని అందుకుంది. దీంతో రాష్ట్రవాసుల్లో మళ్లీ అందోళన రేకెత్తుతోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మిషన్ లను కూడా ఏర్పాటు చేసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే చెన్నైలోని కోయంబేడే మార్కెట్ మరో మారు రాష్ట్రంలో కరోనా కేసులను పెంచుతుంది. ఈ మార్కెట్ కు వెళ్లినవారితో కరోనా మళ్లీ రాష్ట్రంలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 57 కేసులు మాత్రమే నమోదు కాగా, దాదాపు మూడు వారాల తరువాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ కఠిన నిబంధనలు, వైద్యులు, హెల్త్ వర్కర్ల, పోలీసుల శ్రమకు ఫలితం లభిస్తోంది.
తాజాగా నమోదైన 57 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల రెండు వందల మార్కుకు చేరింది. ఈ మేరకు రాష్ట్ర 7వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 2157కి చేరింది. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్యకు మాత్రం బ్రేక్ పటడం లేదు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి వాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.
ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 48 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా చిత్తూరులో 14, నెల్లూరులో 14, కృష్ణలో తొమ్మిది, కర్నూలులో ఎనమిది, తూర్పుగోదావరిలో 1, కడపలో రెండు, అనంతపురంలో నాలుగు, విశాఖపట్నంలో రెండు, విజయనగరంలో మూడు, తూర్పు గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 1252 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 857 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో మరో కరోనా మరణం కూడా నమోదైంది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 122 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 52 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 404 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 101 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 360 పాజిటివ్ కేసులు, పద్నాలుగు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 599గా వుండగా, 18 మరణాలు సంభవించాయి. నెల్లూరు-140 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 63, శ్రీకాకుళంలో ఏడు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 68 కరోనా కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 7, పశ్చిమగోదావరి-69 కేసులు నమోదయ్యాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more