Global Coronavirus death toll passes 2.87 lakh పంజా విసురుతున్న కరోనా.. 2.87 లక్షలు దాటిన మరణాలు

Coronavirus live updates global death toll passes 2 87 lakh

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

Cases of infections of the deadly coronavirus surpassed 4 million worldwide on Monday as COVID-19 spreads across Europe, North America and South Asia. COVID-19 has now infected 4,101,482 people worldwide and 282,700 people have been killed due to this pandemic. Around 1,408,771 people of that tally have recovered.

పంజా విసురుతున్న కరోనా.. 2.87 లక్షలు దాటిన మరణాలు

Posted: 05/11/2020 04:16 PM IST
Coronavirus live updates global death toll passes 2 87 lakh

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 40 లక్షల మంది కరోనా మహమ్మారి ప్రభావానికి గురయ్యారు, యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అసియాలకు విస్తరించిన మహమ్మారి ఏకంగా 200లకు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక అభివృద్ది చెందిన దేశాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇక మందులేని ఈ వైరస్ ను కట్టడి చేయడమెక్కటే మార్గమని అలోచించి చర్యలు తీసుకునే లోపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 2,82,566 మంది మృత్యువాత పడ్డారు. 14,08,771 మంది కోలుకున్నారు.

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి చైనా నుంచి యూరోప్ ప్రాంతానికి, యూరోప్ నుంచి ఉత్తర అమెరికాకు తన ప్రభావాన్ని చాటింది. ప్రధానంగా అమెరికాలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రస్థాయిలో సాగుతున్న విషయం తెలిసింది. ఇక అగ్రరాజ్యంలో గజగజలాడిస్తున్న కోరానా అనేక మంది అమెరికన్ల ఉసురు తీసింది గడిచిన 24 గంటల వ్యవధిలో 776 మరణాలు సంభవించాయి, దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 80వేలకు చేరులో వుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి,

అయితే అమెరికాలో గత మార్చి నుంచి కోనసాగుతున్న మరణాలతో పోల్చితే ఇవాళ కనిష్టస్థాయిలో నమోదైయ్యాయని యూనివర్సిటీ వర్గాలు పేర్కోన్నాయి, మార్చి నుంచి ప్రతి నిత్యం వెయ్య నుంచి రెండున్నర వేల మరణాల మరకు గరిష్టంగా నమోదయ్యాయని పేర్కోన్నాయి, దీంతో అమెరికావాసుల్లో కాసింత ఊరట లభిస్తోంది, ఇక కరోనా పాజిటివ్ కేసుల కూడా ఏకంగా 13,29,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు ఏకంగా 79,508 మరణాలు సంభవించాయని తాజాగణంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక యూనైటెడ్ కింగ్ డమ్ తో పాటు రష్యాలో మహమ్మారి విజృంభన ఉదృంతంగానే కోనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఏకంగా 2లక్షల 20 వేల మందిపై ప్రభావాన్ని చాటిన కరోనా ఏకంగా 31,855 మంది ఉసురు తీసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ లో విధించిన లాక్ డౌన్ ను వచ్చె నెల 1 వరకు కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. లో 2,15,216 మందికి కరోనా నిర్ధారణ కాగా, 24,824 మంది మరణించారు. ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ పర్యాటక దేశంలో 2,07,428 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28,236 మంది ప్రాణాలు విడిచారు. బ్రిటన్ లో 1,77,454 పాజిటివ్ కేసులు, 27,510 మరణాలు నమోదు కాగా, జర్మనీలో 1,64,054 పాజిటివ్ కేసులు, 6,735 మరణాలు సంభవించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles