కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 40 లక్షల మంది కరోనా మహమ్మారి ప్రభావానికి గురయ్యారు, యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అసియాలకు విస్తరించిన మహమ్మారి ఏకంగా 200లకు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక అభివృద్ది చెందిన దేశాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇక మందులేని ఈ వైరస్ ను కట్టడి చేయడమెక్కటే మార్గమని అలోచించి చర్యలు తీసుకునే లోపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 2,82,566 మంది మృత్యువాత పడ్డారు. 14,08,771 మంది కోలుకున్నారు.
చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి చైనా నుంచి యూరోప్ ప్రాంతానికి, యూరోప్ నుంచి ఉత్తర అమెరికాకు తన ప్రభావాన్ని చాటింది. ప్రధానంగా అమెరికాలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రస్థాయిలో సాగుతున్న విషయం తెలిసింది. ఇక అగ్రరాజ్యంలో గజగజలాడిస్తున్న కోరానా అనేక మంది అమెరికన్ల ఉసురు తీసింది గడిచిన 24 గంటల వ్యవధిలో 776 మరణాలు సంభవించాయి, దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 80వేలకు చేరులో వుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి,
అయితే అమెరికాలో గత మార్చి నుంచి కోనసాగుతున్న మరణాలతో పోల్చితే ఇవాళ కనిష్టస్థాయిలో నమోదైయ్యాయని యూనివర్సిటీ వర్గాలు పేర్కోన్నాయి, మార్చి నుంచి ప్రతి నిత్యం వెయ్య నుంచి రెండున్నర వేల మరణాల మరకు గరిష్టంగా నమోదయ్యాయని పేర్కోన్నాయి, దీంతో అమెరికావాసుల్లో కాసింత ఊరట లభిస్తోంది, ఇక కరోనా పాజిటివ్ కేసుల కూడా ఏకంగా 13,29,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు ఏకంగా 79,508 మరణాలు సంభవించాయని తాజాగణంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక యూనైటెడ్ కింగ్ డమ్ తో పాటు రష్యాలో మహమ్మారి విజృంభన ఉదృంతంగానే కోనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఏకంగా 2లక్షల 20 వేల మందిపై ప్రభావాన్ని చాటిన కరోనా ఏకంగా 31,855 మంది ఉసురు తీసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ లో విధించిన లాక్ డౌన్ ను వచ్చె నెల 1 వరకు కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. లో 2,15,216 మందికి కరోనా నిర్ధారణ కాగా, 24,824 మంది మరణించారు. ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ పర్యాటక దేశంలో 2,07,428 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28,236 మంది ప్రాణాలు విడిచారు. బ్రిటన్ లో 1,77,454 పాజిటివ్ కేసులు, 27,510 మరణాలు నమోదు కాగా, జర్మనీలో 1,64,054 పాజిటివ్ కేసులు, 6,735 మరణాలు సంభవించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more