కరోనావైరస్ మహమ్మారి విజృంభనను కట్టడి చేసేందుకు మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో వున్న వలస కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఈ క్రమంలో తొలిదశ లాక్ డౌన్ నేపథ్యంలోనే ఆకలితో అలమటిస్తూ, వుండలేక భార్యబిడ్డలతో తమ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికులు కాలినడకను వందల కిలోమీటర్లు నడిచిన ఘటనలు ఉత్పన్నమయ్యాయి, ఈక్రమంలో తమ మజిలీలకు చేరుకునే ప్రయత్నంలో పలువురు వలసజీవులు తుదిమజిలీకి చేరకున్నారు.
ఇక మూడో విడత లాక్ డౌన్ అవమల్లోకి వచ్చిన తరువాత తమ కోసం శ్రామిక్ రైళ్లు నడపుతుందన్న సమాచారం కూడా బహుదూరపు బాటసారులకు తెలియకపోవడంతో ఇంకా వారు కాలిబాటనే తరలుతున్నారన్న సమాచారం అందిన కేంద్రం.. తాజాగా వలస కార్మికుల తరలింపుపై తాజాగా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. ఇక దీనికి తోడు వలస కార్మికులు నడకమార్గంలో నడుస్తూ రావడంతో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని, దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రహోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు.
వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులను రోడ్డు లేదా ప్రత్యేక శ్రామిక్ రైలు ప్రయాణాల ద్వారా తరలిచాలని భల్లా పేర్కోన్నారు. ఇక వీరి కాలిబాటన నడవనీయకుండా చర్యలు తీసుకోవాలని అదేశించింది. రైళ్లలో ప్రయాణించే వరకు కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కోనసాగించడంతో పాటు నీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. స్వస్థలాలకు వెళ్లే కూలీలకు అవకాశం కల్పించాలన్నారు. మెడికల్, పారిశుధ్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రైవేటు క్లినిక్ లు తెరిచే విషయాలపై కూడా సూచనలు చేశారు.
MHA writes to all States/UTs to cooperate with @RailMinIndia in running more #ShramikSpecialTrains without any hindrance & facilitate faster movement of stranded #MigrantWorkers to their native places.
They may be counseled to not walk on roads & rail tracks.#COVID19 pic.twitter.com/aQi70GFTFi
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 11, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more