కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై క్లారిటీ వచ్చింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇవాళ వెల్లడించారు. సీబీఎస్ఈ పరీక్షల కోసం విద్యార్థులంతా ప్రిపేర్ అవ్వాలని ఆయన సూచించారు. జూలైలో నిర్వహించే పరీక్షలక విద్యార్థులకు ఆయన ఇవాళ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, పరీక్షల టైమ టేబుల్ షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ప్రతీ ఏడాది మార్చి-ఏప్రిల్ మాసాల్లో నిర్వహించే ఈ పరీక్షలు ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ తో పరీక్షలు వాయిదాపడ్డాయి. టెన్త్ పరీక్షలు దేశ వ్యాప్తంగా పూర్తి కాగా.. సీఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షలు ఆగిపోయాయి. దీంతో పదవ తరగతి పరీక్షలన్నీ పూర్తైన తరువాత నిర్వహిద్దామని భావించింది సీబీఎస్ఈ బోర్డు. కానీ టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయ్యే సమయానికి కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.
ఇక పన్నెండవ తరగతి పరీక్షలకు ప్రారంభానికి ముందే లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఎగ్జామ్స్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జూలై 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని శుక్రవారం ప్రకటించారు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్. అయితే అన్నీ పరీక్షలను నిర్వహించడం ఇబ్బంది మారుతుందని యూనివర్సిటీ ప్రవేశాలకు సంబంధించిన ముఖ్యమైన 29 సబ్జెక్టులకు మాత్రమే ఎగ్జామ్స్ పెడుతామని గతంలోనే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రకటించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more