Covid-19 cases in Andhra Pradesh cross 1,700-mark ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. 1700 దాటిన కేసులు

Coronavirus latest updates covid 19 cases in andhra pradesh cross 1700 mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

As many as 67 have tested positive for COVID-19 in Andhra Pradesh in the last 24 hours, taking the state's coronavirus tally to 1,717, said the command control room on Tuesday.

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. 1700 దాటిన కేసులు

Posted: 05/05/2020 12:15 PM IST
Coronavirus latest updates covid 19 cases in andhra pradesh cross 1700 mark

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ మాత్రం వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత వారం రోజులుగా ప్రతీ రోజు 60పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 67 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, మంగళవారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17 వేల మార్కు దాటింది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1650కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇక తాజాగా మరో మరణంతో మరణాల సంఖ్య కూడా 34కు చేరింది. నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కర్నూలులో నమోదైంది. దీంతో కర్నూలులో కేసుల సంఖ్య 500 మార్క్ దాటింది, ఆ తరువాత కృష్ణా జిల్లాలు వున్నాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 589 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25, గుంటూరులో 13 కేసులు, అనంతపురంలో 2, కృష్ణలో ఎనమిది, నెల్లూరులో 1, విశాఖపట్నంలో రెండు కేసులు నమోదయ్యాయని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1094 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 80 కరోనా కేసులు నమోదుకాగా, కేసులు నమోదు కాగా, 10 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 338 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 278 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-91 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, పశ్చిమగోదావరి-59, చిత్తూరు-82, విశాఖపట్నం-35, కడప జిల్లాలో 87 కేసులు, అనంతపురం-78 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles