ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ మాత్రం వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత వారం రోజులుగా ప్రతీ రోజు 60పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 67 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, మంగళవారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17 వేల మార్కు దాటింది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1650కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇక తాజాగా మరో మరణంతో మరణాల సంఖ్య కూడా 34కు చేరింది. నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కర్నూలులో నమోదైంది. దీంతో కర్నూలులో కేసుల సంఖ్య 500 మార్క్ దాటింది, ఆ తరువాత కృష్ణా జిల్లాలు వున్నాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 589 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25, గుంటూరులో 13 కేసులు, అనంతపురంలో 2, కృష్ణలో ఎనమిది, నెల్లూరులో 1, విశాఖపట్నంలో రెండు కేసులు నమోదయ్యాయని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1094 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 80 కరోనా కేసులు నమోదుకాగా, కేసులు నమోదు కాగా, 10 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 338 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 278 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-91 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, పశ్చిమగోదావరి-59, చిత్తూరు-82, విశాఖపట్నం-35, కడప జిల్లాలో 87 కేసులు, అనంతపురం-78 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more