కరోనా వైరస్ మహమ్మారి దేశంలో ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించింది. మే 4వ తేదీ నుంచి మూడో విడత లాక్ డౌన్ ప్రారంభం కానుంది. మే 3వ తేదీన రెండు విడత లాక్ డౌన్ ముగిపిపోనున్న తరుణంలో ఇవాళ ప్రధానితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ రెండు వారాల పాటు అనగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నామని పేర్కోంటూ ఒక ప్రకటనను వెలువరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పోడిగింపు నిర్ణయం తీసుకున్నామని పేర్కోంది, దీంతో మే 4 నుంచి మే 17 వ తేదీ వరకు మూడో విడత లాక్ డౌన్ కొనసాగున్నట్లు తెలిపింది. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రీల్ 14 వరకు తొలి విడత లాక్ డౌన్.. ఆ తరువాత ఏప్రీల్ 15 నుంచి మే 3 వరకు రెండవ విడత లాక్ డౌన్ ను కేంద్రప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు, ఆంక్షలు అలాగే కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులనిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్ జోన్లో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతించింది. 33 శాతం సిబ్బందితో గ్రీన్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాలు పని చేయవచ్చని తెలిపింది. వలస కూలీలను తరలించేందుకు రైళ్లకు అనుమతి ఇచ్చింది. విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more