కరోనావైరస్ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ప్రమాణాలను పాటిస్తూ కేసు విచారణను చేపడుతున్న రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తాజాగా జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 10 మంది న్యాయవాదులకు మాత్రమే అనుమతి వున్న కేసు విచారణలో ఏకంగా 40 మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ విచారణలోకి ఎలా వచ్చారని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు, అదే సమయంలో ఓ వైపు విచారణ జరుగుతున్నా న్యాయవాదుల క్రాస్ టాక్ తో అవాంతరం ఏర్పడటం పట్ల తీవ్రంగా మండిపడ్డారు.
దీంతో ఇవాళ విచారణ పూర్తి అవుతుందని భావించిన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసును న్యాయస్థానం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం నుంచి నేరుగా హైకోర్టులోనే విచారణ ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. విచారణకు హాజరయ్యే న్యాయవాదులందరికీ.. పాస్లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్లోకి ఇతరులు రావడంపై మండిపడ్డారు. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. పాస్వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే.. క్రాస్టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి హైకోర్టులోనే విచారణ ఉంటుందని.. భౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన న్యాయవాదుల్నే అనుమతిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more