ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇదే అదనుగా భావించిన మేక మాంసం విక్రయదారులు.. మటన్ రేట్లను అమాంతం పెంచేశారు. మొదట్లో కోడి మాంసంతో కూడా కరోనా వ్యాధి వస్తుందన్న వదంతుల నేపథ్యంలో చికెన్ కొనేందుకు ఎవరూ ముందకురాలేదు. ఫలితంగా చికెన్ ను పలు దుకాణాదారులతో పాటు కోళ్లఫారమ్ యజమానులు కూడా వాటిని ఉచితంగా స్థానికులకు పంచిపెట్టారు.
ఈ క్రమంలో చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో చికెన్ అమ్మాలు జోరందుకున్నాయి. క్రమంగా చికెన్ ధరలకు కూడా రెక్కలు రావడం ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం చికెన్ ధరలు కిలోకు రూ. 240 వరకు కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో మటన్ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా కిలో మటన్ రూ.900 నుంచి వెయ్యి రూపాయల ధర పలుకుతోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. మటన్ ధరలను అమాంతం పెంచడంపై దిద్దుబాటు చర్యలకు దిగింది.
మాంసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు విచ్చలవిడిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అంతేకాదు, చాలా చోట్ల మాంసం కల్తీ చేసి అమ్ముతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మాంసం ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. సుమారు 11 మాంసం దుకాణాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో లైసెన్స్ లేని దుకాణాలపై కొరడా ఝుళిపించారు. ఈ మేరకు మాంసం ధరను కూడా నిర్ణయించారు.
సికింద్రాబాద్లోని కొన్ని మటన్ షాపుల్లో మాంసం కల్తీ చేసి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు జీహెచ్ఎంసీ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. లోపల సోదాలు చేసిన అధికారులు నకిలీ మాంసం అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో మాంసాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడంతో పాటు, ధరల సూచీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు మటన్ ధర కిలో రూ. 700లుగా నియమించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు ప్రతి దుకాణం ముందు అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more