కరోనా కాటువేస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా దాని బారి నుంచి తేరుకోలేకపోతుంది. అగ్రరాజ్యంలో క్రితంరోజు మరో 1,741 మంది మృతిచెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. జార్జియా, ఒక్లహామా, అలస్కా, టెక్సాస్ రాష్ట్రాల్లో లాక్డౌన్ మినహాయింపులతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు ఎక్కువశాతం ‘స్టే ఎట్ హోమ్’కు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. రోగుల చికిత్సలో డిస్ఇన్పెక్టంట్స్ ఇంజెక్షన్స్, అతినీల లోహిత కిరణాల వినియోగంపై వ్యాఖ్యలు దుమారం రేపడంతో మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని ట్రంప్ నిర్ణయించారు.
అంతేకాదు ఆయనకు స్వతహాగా వుండే మీడియాపై అక్కస్సును ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లగక్కారు. ‘వారు (మీడియా) ఎలాగూ విరుద్ధ ప్రశ్నలు అడుగుతారు. వాస్తవాలను రిపోర్ట్ చేయరు. వారికి మంచి రేటింగ్స్ రావొచ్చు. అమెరికన్లకు తప్పుడు వార్తలు తప్ప ఏ ప్రయోజనం ఉండదు. దానితో సమయం, పని వృథా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. హ్యూస్టన్లో ప్రవాస భారతీయలు నడుపుతున్న ‘సేవా ఇంటర్నేషనల్’ సంస్థ 30 వేల మాస్క్లు, గ్లోవ్స్, 20 వేల ఔన్స్ల శానిటైజర్ను ఆస్పత్రులు, అధికారులకు పంపిణీ చేసింది. రష్యాలో రికార్డు స్థాయిలో 6,361 కేసులు నమోదయ్యాయి. 66 మంది చనిపోయారు. మొత్తం సంఖ్య 747కు చేరింది.
నెలలో అత్యల్పంగా.. యూకేలో 413 మంది మృతి చెందారు. ఆఫ్రికా ఖండంలో కేసులు 30 వేలు దాటాయి. 1,374 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా 60 మందితో కలిపి ఇరాన్లో మృతుల సంఖ్య 5,710కి చేరింది. సింగపూర్లో కేసులు 13 వేలను దాటాయి. కొత్తగా 931 మంది వైరస్ బారినపడ్డారు. ఢాకాలోని 31 మంది ఇస్కాన్ ఆలయ సిబ్బంది కరోనా సోకింది. పరీక్షలు, చికిత్స అందించే సామర్థ్యం లేకపోవడంతో.. 3,200 మంది భారతీయులను పంపించేందుకు హాంకాంగ్ సిద్ధమైంది. కరోనాతో చనిపోనప్పటికీ.. ముగ్గురు ప్రవాసుల మృతదేహాలను వెనక్కు పంపడంపై యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more