తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తోంది. కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా వ్యాప్తి.. మళ్లి పుంజుకున్నట్లు కనిపిస్తోంది, దీంతో తెలంగాణ వాసుల్లో అందోళన చెందుతున్నారు, రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖ పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం తెలంగాణవాసులలో కలవరాన్ని పెంచుతోంది. ఇక తాజా పెరుగుదలతో తెలంగాణలో ఏకంగా 900 మార్క్ దాటింది. మొత్తంగా తెలంగాణలో 928 మంది కరోనా వైరష్ బానరిన పడ్డారు,
విజృంభిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణవాసులకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 175 మంది చిన్నారులపై తన ప్రభావాన్ని చాటుతున్న మమమ్మారి ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన కంబంధహస్తాలలోకి ఎక్కువ మందిని వ్యాపించేలా చేస్తోంది. 345కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. మొత్తం 194 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 1, 09, 975 గృహాల్లో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేయడం జరిగిందని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్ ఇవాళ సూర్యపేటలో పర్యటించారు.
కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లో కరోనా నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలోని హాట్స్పాట్ ప్రాంతాల్లో సీసీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు క్వారంటైన్ కేంద్రాల్లో 210 మంది ఉండగా.. దాదాపు 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. కరోనా కట్టిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ కాలన్ని 14 రోజుల నుండి 28 రోజులకు పెంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more