coronavirus cases reported to 928 in Telangana సీఎం అదేశాలతో సూర్యపేటలో పర్యటించిన సీఎస్, డీజీపీ

9 new coronavirus cases reported in telangana as of 8 00 am apr 22

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

9 new coronavirus cases were reported as of 8:00 AM on Apr 22 in Telangana, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in Telangana to 928. Among the total people infected as on date, 194 have recovered and 23 have passed away.

తెలంగాణలో 928 కరోనా కేసులు, సూర్యాపేటలో పర్యటించిన సీఎస్, డీజీపీ..

Posted: 04/22/2020 01:51 PM IST
9 new coronavirus cases reported in telangana as of 8 00 am apr 22

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తోంది. కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా వ్యాప్తి.. మళ్లి పుంజుకున్నట్లు కనిపిస్తోంది, దీంతో తెలంగాణ వాసుల్లో అందోళన చెందుతున్నారు,  రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖ పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం తెలంగాణవాసులలో కలవరాన్ని పెంచుతోంది. ఇక తాజా పెరుగుదలతో తెలంగాణలో ఏకంగా 900 మార్క్ దాటింది. మొత్తంగా తెలంగాణలో 928 మంది కరోనా వైరష్ బానరిన పడ్డారు,

విజృంభిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణవాసులకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 175 మంది చిన్నారులపై తన ప్రభావాన్ని చాటుతున్న మమమ్మారి ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన కంబంధహస్తాలలోకి ఎక్కువ మందిని వ్యాపించేలా చేస్తోంది. 345కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. మొత్తం 194 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 1, 09, 975 గృహాల్లో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేయడం జరిగిందని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌ ఇవాళ సూర్యపేటలో పర్యటించారు.  

కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లో కరోనా నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జోగులాంబ గద్వాల, వికారాబాద్‌ జిల్లాలోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో సీసీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు క్వారంటైన్‌ కేంద్రాల్లో 210 మంది ఉండగా.. దాదాపు 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. కరోనా కట్టిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ కాలన్ని 14 రోజుల నుండి 28 రోజులకు పెంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles