పోలీసులు సామాన్యులపై అకారణంగానో లేక చిరెత్తి వున్నప్పుడో లాఠీలను ఝుళిపించిన అనేక ఘటనలు చూశాం. ఎంతకాదనుకున్నా. వారు మానవమాత్రులే కదా.. వారికి కోసం తాపం అగ్రహం లాంటి కామకోద్రాలు వుంటాయి కదా.. అంటూ సరిపెట్టుకుంటాం. అయితే పలు సందర్భాల్లో కిందిస్థాయి పోలీసు సిబ్బంది తమ ఉన్నతాధికారులపై అక్కస్సును విపరీత చర్యలకు దారితీసేలా వ్యవహరించడం కూడా అక్కడక్కడా చూశాం. ఇలా కాని పక్షంలో తమ ఉన్నతాధికారులపై అంతకుమించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఉత్తరప్రదేశ్లో ఇందుకు బిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఏకంగా అతని పై పైఅధికారిపైనే లాఠీని ఝుళిపించాడు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కోనసాగుతున్న తరఉణంలో తన విధులను సక్రమంగా నిర్వహించకుండా చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను తిట్టినందుకు గాను పై అధికారిపై హెడ్ కానిస్టేబుల్ లాఠీతో బదులు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో వెంనువెంటనే స్పందిచంిన జిల్లా ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో కొత్వాలీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామశరాయ్ లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా తనిఖీలు చేయడం లేదనే కారణంతో సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ అతన్ని తిట్టాడు. దీంతో ఆగ్రహించిన రామశరాయ్ లాఠీతో రమేష్ను కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు ఎస్ఐ రమేష్ విషయాన్ని కంట్రోల్ రూమ్ కు తెలియజేశాడు. వెంటనే స్పందించిన జిల్లా పోలీసు అధికారులు రామశరాయ్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు హెడ్ కానిస్టేడుల్ పై పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more