ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచంలోని సుమారు 200 వందలకు పైగా దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అన్నిరంగాల్లో ముందున్న అభివృద్ది చెందిన దేశాలనే ఈ వైరస్ మహమ్మారి దడపుట్టిస్తోంది. అక్కడ నమోదవుతున్న మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికీ ఈ వైరస్ ను ఎలా కట్టడి చేయాలన్న విషయంలో పరిశోధనలు ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని నియంత్రించడానికే ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికీ ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేదు. దీంతో లాక్ డౌన్ అనే ఆయుధాన్ని ప్రభుత్వాలు సంధించాయి. అలాగే స్వీయ నియంత్రణ, సోషల్ డిస్టెన్స్ వంటివి మెయింటేన్ చేస్తూ కరోనాను కట్టడి చేస్తున్నారు. మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాయి. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. అదేమిటంటే, కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం క్రమంగా పెరుగుతోందట. జాతీయ సగటు 7.5 రోజులు ఉండగా.. తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజులు ఉందని ఆరోగ్యశాఖ వివరించింది. జాతీయ సగటు కంటే ఎగువన 18 రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. కరోనా నివారణ, నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ వాటిని అమలు చేసేందుకు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
దేశంలో లాక్ డౌన్కు ముందు కేసుల రెట్టింపునకు 3.4 రోజులు పట్టేదని, ఏప్రిల్ 19 నాటికి అది 7.5కి చేరిందని తెలిపింది.
రెట్టింపు రేటు 20 రోజుల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను పరిశీలిస్తే..
* ఢిల్లీ-8.5 రోజులు
* కర్ణాటక-9.2 రోజులు
* తెలంగాణ-9.4 రోజులు
* ఆంధ్రప్రదేశ్-10.6 రోజులు
* జమ్మూ కశ్మీర్-11.5 రోజులు
* పంజాబ్-13.1 రోజులు
* ఛత్తీస్గఢ్-13.3 రోజులు
* తమిళనాడు-14 రోజులు
* బిహార్-16.4 రోజులుగా ఉంది.
20 నుంచి 30 రోజుల మధ్యలో:
రెట్టింపు రేటు 20 రోజుల నుంచి 30 రోజుల మధ్య ఉన్న వాటిలో
* అండమాన్ నికోబార్-20.1 రోజులు
* హరియాణా-21 రోజులు
* హిమాచల్ ప్రదేశ్-24.5 రోజులు
* చండీగఢ్-25.4 రోజులు
* అస్సాం-25.8 రోజులు
* ఉత్తరాఖండ్-26.6 రోజులు
* లడఖ్-26.6 రోజులుగా ఉంది.
రెట్టింపు రేటు 30 రోజుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒడిశా-39.8 రోజులు, కేరళ-72.2 రోజులుగా ఉంది. గోవాలో కరోనా రోగులందరూ కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇక గత 28 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ ప్రాంతాలులుగా మహే (పుదుచ్చేరి), కొడగు (కర్ణాటక) – పౌడిగర్వాల్ (ఉత్తరాఖండ్)ల్లో నిలిచాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more