దేశప్రజలందరూ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో అనునిత్యం సోషల్ మీడియాను అంటిపెట్టుకునే వుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులతో వారు కలవరానికి గురువుతున్నారు. దీంతో అపత్కాల సమయంలో ప్రజలు ఎలాంటి అందోళనకు గురికాకుండా వుండేందుకు తప్పుడు పోస్టులతో పాటు అలాంటి పోస్టులను అప్ లోడ్ చేసిన వ్యక్తులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల మధ్య వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేలా.. పోస్టులు పెట్టినవారిపైనా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
తాజాగా, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై తప్పుడు పోస్టులను ప్రచారం చేసిని తెలంగాణ వాసిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తప్పుడు పోస్టులు అప్ లోడ్ చేయడంతో పాటు తమ వాట్సాప్ ఖాతాల ద్వారా ఎంతో మందికి పంపడంలో రంగంలోకి దిగిన చిత్తూరు పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటకు వచ్చి మరీ వ్యక్తి అదుపులోకి తీసుకుని చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్ రెడ్డి (56) తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల ద్వారా, కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చారంటూ ప్రచారం చేశాడు.
దీనిపై కాణిపాకం ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈఓ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష్ణు వర్ధన్ రెడ్డిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్షపడుతుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఓ కాలనీ పేరును చెబుతూ, అక్కడ అన్ని కేసులు వచ్చాయని ప్రచారం చేయడం తప్పని, వైరస్ పాజిటివ్ వచ్చిన వారి చిత్రాలను పోస్ట్ చేస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more