అగ్రరాజ్యంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయి. కరోనావైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యంలోని లక్షలాధి మంది దీని బారిన పడి చికిత్స పోందుతుండగా, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 25 వేలు దాటింది. గతం కొన్నాళ్లలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు అత్యధికంగా 2129గా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య అగ్రరాజ్యంలో ఆరు లక్షల మార్కు దాటింది. దీంతో అక్కడి వారిలో ఈ మరణాలు తీవ్ర అందోళనను రేకెత్తిస్తు్నాయి. ఒకే రోజులో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికాలో మరణాల సంఖ్య 19వేలకు చేరువైంది. కేవలం 24 గంటల్లోనే 2043 మంది చనిపోయారు. దీంతో ఇటలీ, స్పెయిన్ ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. మరోవైపు... కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పాజిటివ్ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు. చనిపోతున్నవారిని పూడ్చడానికి సమాధి స్థలాలు సరిపోవడం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ..అమెరికన్లు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అమెరికాలో సంభవించిన మరణాల్లో అత్యధికంగా న్యూయార్క్ లో సంభవించాయి. డెడ్ బాడీస్ తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.
కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజలను రక్షించుకొనేందుకు అమెరికా ప్రభుత్వం..పలు చర్యలు తీసుకొంటోంది. ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారిపోయింది. న్యూయార్క్లో మరణాల సంఖ్య 10,842కు పెరిగింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింది. దీంతొ ఇప్పటి వరకు కరోనాపై పోరులో అసువులు బాసిన వారి సంఖ్య 25,981కి పెరిగింది.
కరోనా వైరస్పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కంటికి కనపడని శత్రువుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని వ్యాఖ్యానించారు. ఇంతటి చీకటి దినాల్లోనూ వెలుగు రేఖలు కనిపిస్తున్నాయన్నారు. పరోక్షంగా పలు ప్రాంతాల్లో వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక తలసరి ఐసీయూలు ఉన్నాయని తెలిపారు. అలాగే 16,000 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు.
ఇక రోగుల లాలాజలంతో పరీక్షించే విధానాన్ని రట్గర్స్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ విధానంలో రోగులు వారి పరీక్షను వారే నిర్వహించుకునే అవకాముందని అన్నారు. తద్వారా వైద్య సిబ్బంది వైరస్ బారినపడకుండా ఇది దోహదం చేయనుందన్నారు. ఇక రాష్ట్రాల్లో విధించిన షట్డౌన్ను ఎత్తివేసే నిర్ణయం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలను తెరిచే నిర్ణయాన్ని గవర్నర్లకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. పటిష్ఠమైన పునుద్ధరణ పథకంతో రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేయోచ్చని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more