Coronavirus: US reports 2,129 deaths in 24 hours అగ్రరాజ్యంలో కరోనా కరాళ నృత్యం: ఒక్కరోజే 2,129 మరణాలు

Us marks record 2 129 coronavirus deaths in 24 hours johns hopkins data

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The US has become the world's first country to have registered Covid-19 deaths in a single day with 2,129 fatalities reported in the past 24 hours, while the number of infections in America has crossed 500,000, the highest in the world, according to Johns Hopkins University data.

అగ్రరాజ్యంలో కరోనా కరాళ నృత్యం: ఒక్కరోజే 2,129 మరణాలు

Posted: 04/15/2020 02:13 PM IST
Us marks record 2 129 coronavirus deaths in 24 hours johns hopkins data

అగ్రరాజ్యంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయి. కరోనావైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యంలోని లక్షలాధి మంది దీని బారిన పడి చికిత్స పోందుతుండగా, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 25 వేలు దాటింది. గతం కొన్నాళ్లలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు అత్యధికంగా 2129గా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య అగ్రరాజ్యంలో ఆరు లక్షల మార్కు దాటింది. దీంతో అక్కడి వారిలో ఈ మరణాలు తీవ్ర అందోళనను రేకెత్తిస్తు్నాయి. ఒకే రోజులో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

ప్రస్తుతం అమెరికాలో మరణాల సంఖ్య 19వేలకు చేరువైంది. కేవలం 24 గంటల్లోనే 2043 మంది చనిపోయారు. దీంతో  ఇటలీ, స్పెయిన్ ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. మరోవైపు... కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పాజిటివ్ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు. చనిపోతున్నవారిని  పూడ్చడానికి సమాధి స్థలాలు సరిపోవడం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ..అమెరికన్లు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అమెరికాలో సంభవించిన మరణాల్లో అత్యధికంగా న్యూయార్క్ లో సంభవించాయి. డెడ్ బాడీస్ తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజలను రక్షించుకొనేందుకు అమెరికా ప్రభుత్వం..పలు చర్యలు తీసుకొంటోంది. ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారిపోయింది. న్యూయార్క్‌లో మరణాల సంఖ్య 10,842కు పెరిగింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింది. దీంతొ ఇప్పటి వరకు కరోనాపై పోరులో అసువులు బాసిన వారి సంఖ్య 25,981కి పెరిగింది.

కరోనా వైరస్‌పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. కంటికి కనపడని శత్రువుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని వ్యాఖ్యానించారు. ఇంతటి చీకటి దినాల్లోనూ వెలుగు రేఖలు కనిపిస్తున్నాయన్నారు. పరోక్షంగా పలు ప్రాంతాల్లో వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక తలసరి ఐసీయూలు ఉన్నాయని తెలిపారు. అలాగే 16,000 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు.

ఇక రోగుల లాలాజలంతో పరీక్షించే విధానాన్ని రట్‌గర్స్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని ట్రంప్‌ వెల్లడించారు. ఈ విధానంలో రోగులు వారి పరీక్షను వారే నిర్వహించుకునే అవకాముందని అన్నారు. తద్వారా వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడకుండా ఇది దోహదం చేయనుందన్నారు. ఇక రాష్ట్రాల్లో విధించిన షట్‌డౌన్‌ను ఎత్తివేసే నిర్ణయం విషయంలో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలను తెరిచే నిర్ణయాన్ని గవర్నర్లకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. పటిష్ఠమైన పునుద్ధరణ పథకంతో రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేయోచ్చని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles