ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి చేరుకుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పదకొండుకు చేరింది. తాజాగా మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 16 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.
క్రితం రోజు సయంత్రం ఐదు గంటల నుంచి ఇవాళ ఉదయం తొమ్మిద గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడైంది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 502కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడి 11 మంది మృతి చెందగా.. 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 118 కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందరాు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో 97 కేసులు నమోదు కాగా ఒకరు మృతిచెందారు. నెల్లూరు-56 కేసులు ఒకరు మృతి, కృష్ణా-45 కేసులు మూడు మరణాలు నమోదయ్యాయి, 33 పాజిటివ్ కేసులు, ప్రకాశం - 42, పశ్చిమగోదావరి-31, చిత్తూరు-23, విశాఖపట్నం-20, అనంతపురం-20 కేసులు రెండు మరణాలు సంభవించాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -17 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణా జిల్లాల్లో నలుగురు, తూర్పు గోదావరి 3, చిత్తూరులో ఒకరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కరోనా వ్యాధి బారిన పడి కొలుకున్నారు. కాగా ప్రస్తుతం 475 మంది కరోనా పాజిటివ్ నేపథ్యంలో చికిత్స పోందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more