ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి చేరుకుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా తొమ్మిదికి చేరింది. తాజాగా మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 14 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. వీటిలో గుంటూరులో 16, కర్నూల్ 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు వచ్చాయి.
ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కేసులు అత్యధికంగా వుండగా, స్థానికులకు మాత్రం ఇవి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది. ఆ తరువాత కర్నూల్ జిల్లా లో అత్యధికంగా 91 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, కరోనా కలకలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసి ఇప్పటికీ నెల రోజులు దాటుతున్నా.. రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడంో కొసమెరుపు. అయితే వైద్య అధికారులు మాత్రం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. తాజాగా ఇద్దరు మరణించడంతో ఏడు గా వున్న సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే కరోనా బారిన పడి మృతిచెందిన ఇద్దరు కూడా ఈ వ్యాధి సోకడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఇద్దరు వ్యక్తులు యాభై ఏళ్లుకు పైగా వయస్సు కలిగిన వారేనని కూడా చెప్పారు. మృతిచెందిన ఇద్దరిలో ఒకరిది కృష్ణ జిల్లా కాగా, ఇతడికి పంజాబ్ లోని జలందర్ నుంచి వచ్చిన వ్యక్తితో వ్యాధి సోకిందని తెలిసింది. మరో ఘటనలో మృతుడు ప్రైవేటు వైద్యుడని, అతని ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి వ్యాధి సోకిందని తెలిపారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూరు-93, నెల్లూరు-56, కృష్ణా-36, కడప-31, ప్రకాశం - 41, పశ్చిమగోదావరి-23, చిత్తూరు-23, విశాఖపట్నం-20, అనంతపురం-15, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -17 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కృష్ణా, విశాఖపట్నాలలో నాలుగురు కోలుకోగా, చిత్తూరు, తూగో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కొలుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more