Corona AP: 34 cases, 2 dead & toll at 473 ఏపీలో తొమ్మిదికి చేరిన మరణాలు.. 473 పాజిటివ్ కేసులు..

Two deaths 34 new coronavirus cases reported in andhra pradesh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 34 new Coronavirus positive cases and two deaths. With this, the number of positive cases as of positive cases as of Tuesday morning stand at 473 and deaths at nine. In all, 14 persons completed treatment and were discharged from hospitals.

ఏపీలో తొమ్మిదికి చేరిన మరణాలు.. 473 పాజిటివ్ కేసులు..

Posted: 04/14/2020 05:59 PM IST
Two deaths 34 new coronavirus cases reported in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా  34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య  473 కి చేరుకుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా తొమ్మిదికి చేరింది. తాజాగా మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 14 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. వీటిలో గుంటూరులో 16, కర్నూల్ 5, ప్రకాశం, కడప జిల్లాల్లో  ఒక్కొక్క కేసు వచ్చాయి.

ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కేసులు అత్యధికంగా వుండగా, స్థానికులకు మాత్రం ఇవి కంటిమీద  కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది. ఆ తరువాత కర్నూల్ జిల్లా లో అత్యధికంగా 91 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, కరోనా కలకలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసి ఇప్పటికీ నెల రోజులు దాటుతున్నా.. రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడంో కొసమెరుపు. అయితే వైద్య అధికారులు మాత్రం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. తాజాగా ఇద్దరు మరణించడంతో ఏడు గా వున్న సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే కరోనా బారిన పడి మృతిచెందిన ఇద్దరు కూడా ఈ వ్యాధి సోకడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఇద్దరు వ్యక్తులు యాభై ఏళ్లుకు పైగా వయస్సు కలిగిన వారేనని కూడా చెప్పారు. మృతిచెందిన ఇద్దరిలో ఒకరిది కృష్ణ జిల్లా కాగా, ఇతడికి పంజాబ్ లోని జలందర్ నుంచి వచ్చిన వ్యక్తితో వ్యాధి సోకిందని తెలిసింది. మరో ఘటనలో మృతుడు ప్రైవేటు వైద్యుడని, అతని ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి వ్యాధి సోకిందని తెలిపారు.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూరు-93, నెల్లూరు-56, కృష్ణా-36, కడప-31, ప్రకాశం - 41, పశ్చిమగోదావరి-23, చిత్తూరు-23,  విశాఖపట్నం-20, అనంతపురం-15, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -17 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కృష్ణా, విశాఖపట్నాలలో నాలుగురు కోలుకోగా, చిత్తూరు, తూగో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కొలుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles